Actress: మదర్స్డే స్పెషల్.. చిన్నప్పటి ఫొటోస్ షేర్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
అంతర్జాతీయ మాతృదినోత్సం (మే08) సందర్భంగా పలువురు సినిమా తారలు తమ తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంగా తమ చిన్ననాటి ఫొటోలను కూడా షేర్ చేశారు. అలా ఓ టాలీవుడ్ హీరోయిన్ పంచుకున్న చిన్ననాటి ఫొటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవాళ (మే08) అంతర్జాతీయ మాతృదినోత్సవం. దీంతో అందరూ తమ తల్లులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గతంలో తమ తల్లులతో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ను నెట్టింట షేర్ చేస్తున్నారు. అలా ఓ టాలీవుడ్ హీరోయిన్ తన చిన్నప్పుడు తల్లితో కలిసి దిగిన కొన్ని అందమైన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మడు తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఫేమస్ హీరోయిన్. చేతి నిండా పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. అందులో యష్, ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్స్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆమె మరెవరో కాదు కాంతార ఛాప్టర్ 1తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన రుక్మిణీ వసంత్. ఇందులో కనకవతిగా ఆమె అందం, అభినయం అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నెగెటివ్ రోల్ లో హీరో రిషబ్ శెట్టికు ఏ మాత్రం తగ్గకుండా నటించి మెప్పించిందీ అందాల తార..
కన్నడ ఇండస్ట్రీకి చెందిన రుక్మిణీ వసంత్ సప్తసాగరాలు దాటి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా ఆకట్టుకుంది. దీని తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో చాలా సినిమాలు చేసిందీ అందాల తార. బఘీరా, బైరతిరంగల్ (కన్నడ), అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, ఏస్ (తమిళ్), మదరాసి వంటి సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అయితే ఈ సినిమాలన్నీయావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకున్నాయి. కానీ గతేడాది రిలీజైన కాంతార ఛాప్టర్ 1 మాత్రం రుక్మిణి వసంత్ కెరీర్ ను మలుపు తిప్పందని చెప్పవచ్చు.
చిన్నప్పుడు తల్లితో రుక్మిణీ వసంత్..
View this post on Instagram
ప్రస్తుతం రుక్మిణి వసంత్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఆమె ఇప్పుడు నటిస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. యశ్ తో కలిసి రుక్మిణీ నటించిన టాక్సిక్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) లోనూ ఆమెనే హీరోయిన్ గా చేస్తోంది. కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
రాజస్థాన్ టూర్ లో రుక్మిణీ వసంత్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




