Tollywood: ముద్దులొలుతుకున్న ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్ కూతురు.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ..

వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తోన్న ఓ భారీ బడ్జెట్ మూవీపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా రిలీజ్ తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోవడం ఖాయం. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: ముద్దులొలుతుకున్న ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్ కూతురు.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ..
Heroine
Follow us

|

Updated on: Jun 07, 2024 | 7:31 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని చూశారా..? ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. దక్షిణాదిలో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఆఫర్స్ మాత్రం క్యూ కడుతున్నాయి. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తోన్న ఓ భారీ బడ్జెట్ మూవీపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా రిలీజ్ తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోవడం ఖాయం. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ఆ బుజ్జాయి ఓ స్టార్ హీరోయిన్ కూతురు. అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ గారాలపట్టి. అగ్రకథానాయిక కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గ్లామర్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ పేరు నెట్టింట మారుమోగుతుంది. ఆ చిన్నారి మరోవరో కాదు.. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్. దివంగత హీరోయిన్ శ్రీదేవి ముద్దుల కూతురు.

హిందీలో ధడక్ సినిమాతో కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. మరాఠీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సైరత్ చిత్రానికి రీమేక్ ఈ మూవీ. అయితే సైరత్ భారీ విజయాన్న అందుకోగా.. ధడక్ మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ తొలి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు అందుకుంది జాన్వీ. ఆ తర్వాత హిందీలో విభిన్న కథలను ఎంచుకుంటూ నటిగా తానేంటో నిరూపించుకుంది. అలాగే వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నెపోటిజం కామెంట్స్ ఎన్ని వచ్చినా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ తార.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అలాగే దేవర తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమాలోనూ నటించనుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రానికి ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అలాగే తమిళంలో సూర్య కొత్త ప్రాజెక్టులో జాన్వీ ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. ఇవే కాకుండా డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోయే చిత్రంలో జాన్వీని ఎంపిక చేయాలని భావిస్తున్నారట. అయితే ఈవిషయంపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.