Tollywood: ‘జర్నీ టు అయోధ్య’.. శ్రీరామనవమి రోజున ‘విశ్వం’ నిర్మాత కొత్త ప్రాజెక్ట్..
ఈరోజు సోషల్ మీడియా మొత్తం కొత్త మూవీ అప్డేట్స్, ప్రాజెక్టుల ప్రకటనలతో సోషల్ మీడియా వేదికగా మారింది. ఈ క్రమంలోనే ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి తన చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2ను ప్రకటించారు. ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపిచంద్ తో విశ్వం సినిమాను నిర్మిస్తున్నారు. అటు ఫస్ట్ మూవీ విడుదల కాకముందే ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ‘జర్నీ టు అయోధ్య’ అనే వర్కింగ్ టైటిల్తో కొత్త సినిమాను తీసుకువస్తున్నారు.. ఈ మూవీకి దర్శకుడు వి.ఎన్.ఆదిత్య కథను అందిస్తున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో అనేక కొత్త చిత్రాలు ప్రారంభమయ్యాయి. అలాగే ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న మూవీస్ కొత్తగా పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈరోజు సోషల్ మీడియా మొత్తం కొత్త మూవీ అప్డేట్స్, ప్రాజెక్టుల ప్రకటనలతో సోషల్ మీడియా వేదికగా మారింది. ఈ క్రమంలోనే ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి తన చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2ను ప్రకటించారు. ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపిచంద్ తో విశ్వం సినిమాను నిర్మిస్తున్నారు. అటు ఫస్ట్ మూవీ విడుదల కాకముందే ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ‘జర్నీ టు అయోధ్య’ అనే వర్కింగ్ టైటిల్తో కొత్త సినిమాను తీసుకువస్తున్నారు.. ఈ మూవీకి దర్శకుడు వి.ఎన్.ఆదిత్య కథను అందిస్తున్నారు.
ఇండస్ట్రీలో ఇప్పటివరకు రామాయణంను ఆధారంగా చేసుకుని అనేక సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో అనేక మంది నటీనటులు సీతా రాములుగా నటించి వెండితెరపై అద్భుతం చేశారు. ఇక మరోసారి రామాయణం బిగ్ స్క్రీన్ పై తీసుకురావడానికి నిర్మాత వేణు దోనేపూడి సిద్ధమయ్యారు. మరో వైపు ఈ సినిమా కోసం డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య ఆధ్వర్యంలో ఓ స్పెషల్ టీం అయోధ్య సహా పలు ప్రాంతాల్లో లొకేషన్స్ సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు ఓ యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిచంనున్నారని టాక్. అలాగే ఇందులో నటించే నటీనటులను, సాంకేతిక నిపుణులను సెలక్ట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు మేకర్స్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ భారీగా నిర్మించబోతున్నారు. ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పీపుల్ మీడియా బ్యానర్తో కలిసి ‘విశ్వం’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Journey towards the rise of Dharma ❤️🔥 #Aagaman2025 🔥
Wishing you a blessed and prosperous Shri Rama Navami once more! #JourneytoAyodhya 🏹#ProductionNo2 📢
Stay Tuned for more updates 🔥@ChitralayamS @VenuDonepudi #KondalJinna @swethadonepudi @Aayush_on_air pic.twitter.com/TjA8yAzU0x
— Chitralayam Studios (@ChitralayamS) April 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.