సినీ ఫక్కీలో హీరోయిన్ పూర్ణ కిడ్నాప్ ప్లాన్..
హీరోయిన పూర్ణను బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు కేరళ పోలీసులు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
హీరోయిన పూర్ణను బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు కేరళ పోలీసులు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విజయ్ సఖ్రే వెల్లడించారు. నిందితులు పూర్ణను సినీఫక్కీలో కిడ్నాప్ చేసేందుకు భారీ ప్లాన్ రెడీ చేసినట్టు వివరించారు సఖ్రే.
తొలుత పూర్ణ మ్యారేజ్ గురించి మాట్లాడి ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తో పరిచయం ఏర్పరచుకుని, అనంతరం కిడ్నాప్ చేయాలని ముఠా ప్రణాళిక రచించినట్టు సఖ్రే తెలిపారు. ఓ హోటల్ గదిలో బంధించి పెద్ద ఎత్తున భారీగా డబ్బు దండుకోవాలని స్కెచ్ వేసినట్టు పేర్కొన్నారు. వీళ్ల టార్గెట్ లో ఎప్పుడూ నటీనటులే ఉంటారని, ఈ ఏడాది మార్చిలోనూ పాలక్కాడ్లో ఎనిమిది మంది మోడల్స్ను కిడ్నాప్ చేసి..వారి వద్ద నుంచి డబ్బూలు వసూలు చేశారని పేర్కొన్నారు. .ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కమెడియన్ ధర్మజన్ బోల్గట్టిని కూడా విచారించినట్లు తెలిపారు సఖ్రెే. ఇందులో ఇతర సినీ వ్యక్తుల హస్తం లేదని నిర్దారించారు.