AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చావు జయించిన టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా 11 గంటలు ఆపరేషన్‌.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

మెరిసే ప్రపంచంలో, తన వృత్తి జీవితం వల్ల తక్కువగా, తన వ్యక్తిగత జీవితం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచే నటి ఉంది. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిన నటి మరెవరో కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా నివసిస్తోంది. కానీ 53 సంవత్సరాల వయస్సులో కూడా ఆమె తరగని అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది. అంతే కాదు చావు అంచుల వరకు వెళ్లివచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

చావు జయించిన టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా 11 గంటలు ఆపరేషన్‌.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: May 10, 2025 | 10:39 AM

Share

తెలుగులో సూపర్ హిట్ సినిమాలు చేసింది. బడా హీరోల సినిమాల్లో నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఇక ఈ బ్యూటీ తన నటనతో పాటు అందంతోనూ ప్రేక్షకులను కవ్వించింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్న ఆ హీరోయిన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పైన కనిపిస్తున్న బ్యూటీ ఇండస్ట్రీలో చాలా పాపులర్ నటి. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. అంతే కాదు ఈ స్టార్ హీరోయిన్ చావు అంచుల వరకు వెళ్లొచ్చింది. ఎంతో ధైర్యంతో ఆమె చావును కూడా ఎదిరించింది. ఐదు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటుంది.

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు. మనీషా కొయిరాలా. ఈ అమ్మడు 1970 ఆగస్టు 16న నేపాల్ రాష్ట్రంలో జన్మించారు. 1991వ సంవత్సరంలో, నటి మనీషా కొయిరాలా చౌధాకర్ అనే హిందీ చిత్రంతో కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. మనీషా కొయిరాలా ఎక్కువగా బాలీవుడ్ సినిమాపై దృష్టి పెట్టింది. ఇక ఆమె నటించిన బొంబాయి, ఒకేఒక్కడు, భారతీయుడు సినిమాలు భారీ హిట్ అయ్యాయి. దాంతో ఒక్కసారిగా మనీష పేరు మారుమ్రోగింది.

కాగా మనీష క్యాన్సర్ తో పోరాడి గెలిచిన విషయం తెలిసిందే.2012లో మనీషా అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. మూడేళ్ల చికిత్స అనంతరం 2015లో ఆమె క్యాన్సర్‌ను జయించారు. దీని గురించి గతంలో ఆమె మాట్లాడుతూ.. అందరిలానే నేను చాలా భయపడ్డాను.. నేను కూడా చచ్చిపోతానను అనుకున్నా.. కానీ న్యూయార్క్ లోని బెస్ట్ డాక్టర్స్ నాకు వైద్యం చేశారు. ఆరునెలలు అక్కడే ఉండి వైద్యం చేయించుకున్నా.. 11 గంటలు ఆపరేషన్‌ చేశారు.  ఆ సమయంలో నా తల్లి ఇచ్చిన ధైర్యంతోనే నేను క్యాన్సర్ తో పోరాడి గెలిచా అని తెలిపింది మనీషా.. మొన్నటివరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తుంది. అది కూడా బాలీవుడ్ లోనే ఆమె నటిస్తుంది . రీసెంట్ గా హీరామండి సినిమాలో చేసింది.

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.