చేసింది ఒకే ఒక్క సినిమా.. రెచ్చిపోయి అందాలు ఆరబోసింది.. కట్ చేస్తే ఛాన్స్‌లు లేక ఇప్పుడు ఇలా

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. అలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. చేసింది ఒకే ఒక్క సినిమా.. ఆ సినిమాలో తన అందాలతో రెచ్చిపోయింది.

చేసింది ఒకే ఒక్క సినిమా.. రెచ్చిపోయి అందాలు ఆరబోసింది.. కట్ చేస్తే ఛాన్స్‌లు లేక ఇప్పుడు ఇలా
Actress

Updated on: Jul 25, 2025 | 9:40 PM

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పటికే ఇతర బాషలనుంచి చాలా మంది హీరోయిన్స్ మనదగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. మొన్నటివరకూ ఎక్కడ విన్నా ఓ ముద్దుగుమ్మ పేరు వినిపించింది. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే  కనిపించాయి. మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే.. ఆమె ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె క్రేజ్ చూస్తుంటే మెంటలెక్కాల్సిందే.. అందంతో కుర్రకారును కట్టిపడేసింది ఆమె.. అంతే కాదు అవకాశాలు వస్తే ఎలాంటి పాత్ర అయిన రెడీ అంటుంది.. చేసింది ఒకే ఒక్క సినిమా.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఉదయ్ కిరణ్ హీరోయిన్

అందం అభినయం ఉన్న భామలు ఈ మధ్యకాలంలో అంతగా అవకాశాలు అందుకోలేకపోతున్నారు. కానీ ఈ చిన్నది మాత్రం తన అందంతోనే స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. చేసింది ఒకే ఒక్క సినిమా కానీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఎలాంటి పాత్రైనా సరే రెడీ అంటుంది. ఇంతకూ ఆమె ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ వదిలిన బాణం ఆరాధ్యదేవి. ఈ అమ్మడి అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. 23 ఏళ్ల ఈ అందాల భామ ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాన్న ప్రతిరూపం మా తారకరాముడు..! అభిమానుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్న వీడియో

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ అమ్మడిని సోషల్ మీడియాలో వెతికి మరీ పట్టుకున్నాడు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఈ అమ్మడి అందాన్ని చూసి ఫిదా అయిన వర్మ గా పెట్టి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్టుగానే ఆమెను హీరోయిన్ గా పేటి శారీ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమాలో ఆరాధ్య దేవి అందాలను ఓ రేంజ్ లో చూపించనున్నాడు వర్మ.. ఈ సినిమా ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇన్ స్టాలో రీల్స్ చేసే సమయంలో చీర కట్టులో పద్దతిగా కనిపించిన ఆరాధ్య.. ఇప్పుడు ఈ రేంజ్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంటే నెటిజన్స్ షాక్ అవుతున్నారు. గతంలో ఆరాధ్య మాట్లాడుతూ.. అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంటుంది. గ్లామర్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే ఇప్పుడు తన అభిప్రాయాలు మారిపోయాయని  తెలిపింది. గ్లామర్ అనేది చాలా పర్సనల్. నాకు, అది వృత్తిలో భాగం. గ్లామరస్‌గా ఉన్నా, లేకపోయినా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధమే అని చెప్పుకొచ్చింది ఆరాధ్య. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :ఈ అమ్మాయి కళ్ళతోనే కట్టిపడేసింది.. రాజమౌళికి బాగా నచ్చిన హీరోయిన్ ఈ అమ్మడేనట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.