Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basha Movie: రజినీకాంత్ బాషా సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్స్ ఎవరో తెలుసా ?.. ఇద్దరూ టాలీవుడ్ టాప్ హీరోస్..

ఇప్పటివరకు ఆయన నటించిన ఎన్నో హిట్ చిత్రాల్లో భాషా ఒకటి. ఈ సినిమాతో రజినీ సౌత్ ఇండియా వ్యాప్తంగానే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాలో ముంబైని గడగడలాడించిన డాన్ ఆటో డ్రైవర్ గా ఎలా మారతాడు అనేది ఈ సినిమా.

Basha Movie: రజినీకాంత్ బాషా సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్స్ ఎవరో తెలుసా ?.. ఇద్దరూ టాలీవుడ్ టాప్ హీరోస్..
Basha
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 09, 2023 | 5:50 PM

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా రజినీ అంటే పడిచచ్చే అభిమానులున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రజినీ. ఆర్టీసీ కండక్టర్ స్తాయి నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టి.. తన నటన.. మేనరిజంతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మెప్పించారు. ఇప్పటివరకు ఆయన నటించిన ఎన్నో హిట్ చిత్రాల్లో భాషా ఒకటి. ఈ సినిమాతో రజినీ సౌత్ ఇండియా వ్యాప్తంగానే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాలో ముంబైని గడగడలాడించిన డాన్ ఆటో డ్రైవర్ గా ఎలా మారతాడు అనేది ఈ సినిమా.

ఈ సూపర్ హిట్ సినిమాను ముందుగా తమిళంలో తీశారు. డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయాలని భావించారు మేకర్స్. కానీ సురేష్ కృష్ణ తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారట. ఈ సినిమాలో రజినీ పాత్రలో బాలకృష్ణ లేదా చిరంజీవితో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే పలువురు స్టార్స్ కోసం భాషా నిర్మాతలు దేవీ శ్రీ థియేటర్లో స్పెషల్ షో వేశారట. కానీ మన హీరోలకు ఈ సినిమా అంతగా నచ్చలేదట. ఇక బాలయ్య రీమేక్ సినిమాలకు దూరంగా ఉండేవారు. దీంతో ఈ భాషా సినిమా అవకాశాన్ని అంతగా తీసుకోలేదట.

ఇవి కూడా చదవండి

అలా చిరంజీవి.. బాలయ్య ఇద్దరూ ఈ సినిమా అవకాశాన్ని వదులుకోవడంతో.. చేసేదేమి లేక.. అదే చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయగా..ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో నగ్మా కథానాయికగా నటించగా.. రఘువరన్ కథానాయకుడిగా కనిపించారు.