Tollywood: ‘మర్యాద రామన్న’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా!
సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా తోడుండాలి. ఈ మూడు క్వాలిటీస్తో..

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా తోడుండాలి. ఈ మూడు క్వాలిటీస్తో కొందరు హీరోయిన్లు అనదికాలంలోనే స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. అలాగే అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నవాళ్లు లేకపోలేదు. ఇక.. ఇండస్ట్రీలోకి అలా.. వచ్చి.. ఇలా కనుమరుగైపోయిన తారలు చాలామంది ఉన్నారు. వారిలో ఒకరు సలోని అశ్వని. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’ సినిమాతో సూపర్ హిట్ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఆ సినిమాలో తన నటనకు గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో సలోని చేసింది తక్కువ సినిమాలే. 2016లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఆమె నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇప్పుడు తాజాగా హైదరాబాద్లోని ఓ జ్యువెలరీ ర్యాంప్ షోలో కనిపించి అందరూ అవాక్ అయ్యేలా చేసింది ఈ భామ. ఆమెను చూసిన అభిమానులు.. మొదటిగా ఈ నటి మర్యాద రామన్నలో నటించిన సలోని అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. అప్పుడు అందంగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడేమో కాస్త బొద్దుగా మారిపోయేసరికి ఫ్యాన్స్ షాకయ్యారు.
కాగా, మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ ఉన్న సలోనిని.. ఆమె తల్లి ఎప్పుడూ ప్రోత్సహించింది. సలోనికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలు ఆఫర్లు వస్తున్నా.. ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం ఆమె ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఈ అమ్మడు పెళ్లికి కూడా దూరంగానే ఉంది.
View this post on Instagram
