AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venky Movie: వెంకీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?.. స్నేహ కంటే ముందు తనే..

ఇక ఇందులో తనదైన కామెడీతో మరోసారి కడుపుబ్బా నవ్వించాడు మాస్ మాహారాజా. ఇందులో రవితేజ సరసన స్నేహ నటించింది. అలాగే తనికెళ్ల భరణి, ఢిల్లీ రాజేశ్వరీ, బ్రహ్మానందం, ఎవిఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి కీలకపాత్రలలో నటింటారు. ఇక ఇటీవలే ఈ సినిమాను రీరిలీజ్ చేయగా మరోసారి సెన్సెషన్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రీరిలీద్ సమయంలో ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి చెప్పక్కర్లేదు.. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది.

Venky Movie: వెంకీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?.. స్నేహ కంటే ముందు తనే..
Venky
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2024 | 12:35 PM

Share

మాస్ మహారాజా రవితేజ ఫిల్మ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ వెంకీ. డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఈ మూవీకి మరో హైలెట్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్. ఇక ఇందులో తనదైన కామెడీతో మరోసారి కడుపుబ్బా నవ్వించాడు మాస్ మాహారాజా. ఇందులో రవితేజ సరసన స్నేహ నటించింది. అలాగే తనికెళ్ల భరణి, ఢిల్లీ రాజేశ్వరీ, బ్రహ్మానందం, ఎవిఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి కీలకపాత్రలలో నటింటారు. ఇక ఇటీవలే ఈ సినిమాను రీరిలీజ్ చేయగా మరోసారి సెన్సెషన్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రీరిలీద్ సమయంలో ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి చెప్పక్కర్లేదు.. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‏గా ఫస్ట్ ఛాయిస్ స్నేహ కాదట. ఇందులో శ్రావణి పాత్ర కోసం ముందుగా హీరోయిన్ ఆసిన్ అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల సాధ్యం కాలేదట. దీంతో చివరకు శ్రావణి పాత్ర కోసం స్నేహను తీసుకున్నారు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీనువైట్ల. ఈ సినిమాలో మరోసారి తన అద్భుతమైన నటనతో మెప్పించారు స్నేహ. వీరిద్దరి కాంబోలో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని ట్రైన్ సీన్ కు ఇప్పటికీ సెపరేట్ ఫ్యానస్ బేస్ ఉంది.

వెంకీ కాకుండా.. డైరెక్టర్ శ్రీను వైట్ల.. రవితేజ కాంబోలో మరో మూడు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల గోపిచంద్ తో చేయబోయే సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే రవితేజ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ మూవీని త్వరలోనే అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.