AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది.. కొంతమంది మోసం చేశారు: కృష్ణవంశీ

దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత అభిప్రాయాలు, ఇతర దర్శకులు, నటీనటులపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన సినిమాలలో తనకు అత్యంత నచ్చిన చిత్రంగా సింధూరంను కృష్ణవంశీ పేర్కొన్నారు.

ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది.. కొంతమంది మోసం చేశారు: కృష్ణవంశీ
Krishna Vamsi
Rajeev Rayala
|

Updated on: Aug 31, 2026 | 8:30 AM

Share

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, తన కెరీర్‌లో నిర్మాతల నుండి ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్ల గురించి ఓ  కార్యక్రమంలో భాగంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. నిర్మాతలతో తాను అనుభవించిన మోసాలను “కోకొల్లలు” అని పేర్కొంటూ, ఇది వారి “ప్రవృత్తి” లేదా “వ్యాపకం” అని ఆయన అభివర్ణించారు. ఆయన దృష్టిలో, “డబ్బు ఇంపార్టెంట్ అనుకోను.” అని అన్నారు కృష్ణవంశీ డబ్బు కంటే సినిమా పూర్తవడమే తనకు ముఖ్యమని వెల్లడించారు. దీనికోసం తాను రాజీపడటానికి సిద్ధంగా ఉంటానని ఆయన తెలిపారు. ఒకానొక సందర్భంలో, “మురికిగుంటలో పడిన ఉంగరం” ఉదాహరణతో వివరించారు. ఆ ఉంగరం (డబ్బు) అత్యంత విలువైనదిగా భావిస్తే, దానిని తీయడానికి మురికిలో చేయి పెడతామని, లేదా అదొక బంగారం మాత్రమే అనుకుంటే వదిలేసి కొత్తది కొనుక్కుంటామని చెప్పారు. ఈ పోలిక ద్వారా నిర్మాతలతో ఎదురైన ఆర్థిక మోసాలను తాను ఎలా చూస్తాడో వివరించారు. డబ్బు కోసం గొడవ పడితే, వారి స్థాయికి మనం దిగజారినట్లే అవుతుందని కృష్ణవంశీ అన్నారు.

ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా

అందరు నిర్మాతలు ఒకేలా ఉండరని కృష్ణవంశీ స్పష్టం చేశారు. నటుడు నాగార్జున, మనోహర్, జయనారాయణ వంటి నిర్మాతలు తమతో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, నిక్కచ్చిగా వ్యవహరించారని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా డబ్బులు సక్రమంగా ఇచ్చారని ఆయన ప్రశంసించారు. తన తొలి చిత్రం “గులాబి” నుంచి “చందమామ”, “మురారి” వంటి సినిమాల వరకు కథ చెప్పినప్పుడు, ప్రొడక్షన్ దశలో ఎలాంటి సమస్యలు వచ్చాయో ఆయన పంచుకున్నారు.

అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..

“సింధూరం” సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టిందని, ఆ తర్వాతే “శ్రీఆంజనేయం” చిత్రాన్ని ప్రారంభించానని కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తనకు అప్పులు లేవని చెప్పారు. తన కెరీర్‌లో రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు నంది అవార్డులు అందుకున్న కృష్ణవంశీ, వ్యక్తిగత జీవితంలో నటి రమ్యకృష్ణన్‌ను 2003లో వివాహం చేసుకున్నారు. ఆయనకు సినిమా పూర్తవడమే ప్రధానం తప్ప, ఆర్థిక ప్రయోజనాలు ద్వితీయమని ఆయన మాటల ద్వారా స్పష్టమైంది. తన సినీ ప్రయాణంలో ఎదురైన ఆర్థిక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, తన కళ పట్ల అంకితభావంతో ముందుకు సాగారు.

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us