AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..

దర్శకుడు కృష్ణవంశీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ నటుడితో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. అలాగే తన వ్యక్తిగత బంధం, అలాగే సృజనాత్మక సహకారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అతడిని దర్శకుడిగా మార్చడానికి ప్రయత్నించి, "మల్లెపువ్వు" ప్రాజెక్టును మొదలుపెట్టడం, అది "చందమామ"గా మారడం వెనుక కారణాలు వివరించారు.

Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..
Krishnavamsi
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2026 | 11:00 AM

Share

తెలుగు దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన సన్నిహితులతో గతంలో ఉన్న బంధాలు, ప్రస్తుతం వారితో దూరం కావడానికి గల కారణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తన పాత సర్కిల్‌లో కొంతమంది ఎందుకు లేరని అడగ్గా, బహుశా వారికి విజయం లేకపోవడం వల్ల కావచ్చునని, లేదా తాను జనంలో ఉండే వ్యక్తిని కాదని కృష్ణవంశీ బదులిచ్చారు. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, భార్య రమ్యకృష్ణ, కుమారుడితో గడపడం తనకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయని తెలిపారు. ఉత్తేజ్‌తో కృష్ణవంశీకున్న ప్రత్యేక అనుబంధంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో ఉత్తేజ్‌ను “నా పేరులో సగం వాడు” అని అభివర్ణించిన కృష్ణవంశీ, ఇప్పుడు ఆ బంధం విచ్ఛిన్నం కావడానికి గల కారణాలను పరోక్షంగా వెల్లడించారు. మానవ సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాలంతో పాటు మారుతూ, పరిపక్వమవుతాయని ఆయన వివరించారు. నిన్న తెలివైనదిగా అనిపించిన విషయం ఈరోజు అసంబద్ధంగా తోచవచ్చని, చాలామంది విజయాన్ని డబ్బుతో కొలుస్తారని, అయితే తాను దానికి మించిన దాన్ని వెతుకుతున్నానని కృష్ణవంశీ పేర్కొన్నారు.

ఉత్తేజ్‌ను దర్శకుడిగా పరిచయం చేయాలని కృష్ణవంశీ గతంలో “మల్లెపువ్వు” చిత్రాన్ని ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించగా, అసలు షూటింగ్ జరగలేదని కృష్ణవంశీ స్పష్టం చేశారు. ఉత్తేజ్ దర్శకత్వం చేయడానికి సిద్ధంగా లేడని, అతను జన్మతహా నటుడని, నటనపైనే ఆసక్తి కలిగి ఉన్నాడని కృష్ణవంశీ తెలిపారు. ఉత్తేజ్ రచన చాలా బాగుంటుందని, తన ఆలోచనలకు దగ్గరగా రాయగలడని కృష్ణవంశీ ప్రశంసించారు. రామ్ గోపాల్ వర్మ బృందం (నరసింహారావు, తేజ, ఉత్తేజ్, కృష్ణవంశీ, జేడీ చక్రవర్తి) లోని సభ్యులుగా వారంతా సృజనాత్మకంగా కలిసి ఎదిగారని, తమ మధ్య బలమైన భావోద్వేగ బంధం ఉందని కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు.

తాను దర్శకుడిగా ఎదిగి, సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినప్పుడు, ఉత్తేజ్‌ను దర్శకుడిగా మారమని చాలా బలవంతం చేశానని కృష్ణవంశీ అంగీకరించారు. అయితే ఉత్తేజ్ తనను తాను దర్శకుడిగా చూడలేదని, నటుడిగానే ఉండాలనుకున్నాడని పేర్కొన్నారు. “నోరు మూసుకుని చెయ్యి” అని కూడా కొంత ఒత్తిడి చేశానని, కానీ దర్శకత్వాన్ని బలవంతం చేయలేమని తాను గ్రహించానని తెలిపారు. ఆ తర్వాత “మల్లెపువ్వు” ప్రాజెక్టును విరమించుకొని, అదే కథాంశంతో “చందమామ” సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించారు. ఉత్తేజ్ రచనాశైలి ఇప్పటికీ తనకు ఇష్టమే అయినా, వ్యక్తిగత విభేదాల కారణంగా అతనితో కలిసి పనిచేయలేకపోతున్నానని కృష్ణవంశీ విచారం వ్యక్తం చేశారు. సృజనాత్మకత అనేది కేవలం ఒక ఉద్యోగం కాదని, అది తన వ్యక్తిత్వం, జ్ఞానం, వివేకం, కరుణ, మానవతా దృక్పథం నుండి పుడుతుందని ఆయన లోతుగా వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

ఉత్తేజ్ ఫోటో..

Krishnavamsi, Uttej

Krishnavamsi, Uttej

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

Follow Us