AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది.! ఎందుకో తెలుసా

అక్కినేని, నందమూరి వారసులైన బాలకృష్ణ, నాగార్జున కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. 2011లో క్రిస్టియన్ బ్రదర్స్ రీమేక్ కోసం బెల్లంకొండ సురేష్ వీరిద్దరినీ ఒప్పించినప్పటికీ, చివరి నిమిషంలో ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Tollywood: బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది.! ఎందుకో తెలుసా
Nagarjuna & Balakrishna
Ravi Kiran
|

Updated on: Feb 01, 2026 | 1:35 PM

Share

నందమూరి, అక్కినేని కుటుంబాల వారసులైన బాలకృష్ణ, నాగార్జున కలిసి ఒక సినిమాలో నటించాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే చూడాలని కొంతమంది ఫ్యాన్స్ కల. 2011లో మలయాళంలో ఘన విజయం సాధించిన క్రిస్టియన్ బ్రదర్స్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నించారు. ఈ రీమేక్ కోసం బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్నదమ్ముల కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు జోషి దర్శకత్వం వహించాల్సి ఉంది. బాలయ్య, నాగార్జున అంగీకరించడంతో సురేష్ ఉత్సాహంగా అడుగులు వేశారు. అయితే, దర్శకుడి ఎంపిక మిగిలి ఉండగానే ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది.

రకరకాల కారణాల వల్ల సినిమా నిర్మాణం ముందుకు సాగలేదు. బెల్లంకొండ సురేష్ ఎంతో ప్రయత్నించినప్పటికీ, ఈ కలయిక కార్యరూపం దాల్చలేదు, అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. క్రిస్టియన్ బ్రదర్స్ సినిమా గురించి మరిచిపొమ్మని, మరో కథ తయారు చేసుకోమని బాలకృష్ణ సురేష్‌కు సూచించారు. ఆ తర్వాత 2011 జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బెల్లంకొండ సురేష్ హరహర మహాదేవ చిత్రాన్ని ప్రారంభించారు. నరసింహనాయుడు విడుదలైన ఏడేళ్ల తర్వాత బాలకృష్ణ, దర్శకుడు బి. గోపాల్ కాంబినేషన్లో మొదలైన చిత్రమిది.

ఇది చదవండి: 

అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?

అందంలో శ్రీదేవికే పోటీ.. ఎక్స్‌పోజింగ్ అక్కర్లేదని చెప్పింది.. ఎవ్వరికీ తెలియని నిజాలు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..