AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Ajrun: సతీమణి బర్త్ డే స్పెషల్.. కుటుంబంతో కలిసి గోల్డెన్ టెంపుల్‏లో అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ సందర్శించారు. సెప్టెంబర్ 29న ఆయన భార్య స్నేహ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.

Allu Ajrun: సతీమణి బర్త్ డే స్పెషల్.. కుటుంబంతో కలిసి గోల్డెన్ టెంపుల్‏లో అల్లు అర్జున్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Sep 29, 2022 | 7:12 PM

Share

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమృత్ సర్‌లో గోల్డెన్ టెంపుల్‌ను గురువారం సందర్శించారు. ఆయనతో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా ఉన్నారు. సెప్టెంబర్ 29న బన్నీ సతీమణి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫ్యామిలీ ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ క్రమంలో గురువారం ఉదయం ఫ్యామిలీతో కలిసి అమృత్ సర్‏లోని గోల్డెన్ టెంపుల్‏ను సందర్శించారు. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిన బన్నీ చూడగానే ఒక్కసారి ఫ్యాన్స్ చుట్టు ముట్టారు. తమ కళ్ల ముందే స్టార్ హీరో సాధారణ వ్యక్తిలా కనిపించే సరికి ఒక్కసారిగా స్టన్ అయ్యారు. స్వర్ణదేవాలయ దర్శనం అనంతరం ఫ్యాన్స్ కోరిక మీదట వారితో కుటుంబ సమేతంగా ఫోటోలు దిగారు బన్నీ.

ప్రస్తుతం అల్లు అర్జున్.. పుష్ప 2 చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించారు. ఇందులో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్నా, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా సిక్వెల్ పుష్ప 2 చిత్రీకరణ జరుగుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.