Allu Arjun: చిన్న సినిమాలతోనే సంచలనం.. కట్ చేస్తే.. అల్లు అర్జున్తో మలయాళీ డైరెక్టర్..
పుప్ప 1, 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీంతో ఇప్పుడు ఈ హీరో సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మలయాళంలో చిన్న సినిమాలతో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారట.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. పుష్ప సినిమాలతో ఈ హీరో ఫాలోయింగ్ మరింత పెరిగింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బన్నీ అంటే ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరో చేయబోయే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇదివరకే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ మూవీలో బన్నీ జోడిగా బీటౌన్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా కనిపించనుందని మేకర్స్ ప్రకటించారు.
అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇలాగే బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లోఓ సినిమా చేయనున్నాడని టాక్. ఈ రెండింటిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇప్పుడు బన్నీ డైరెక్టర్స్ లీస్ట్ లోకి మరో పేరు వచ్చి చేరింది. తాజాగా బన్నీ నెక్ట్స్ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది.
అట్లీ సినిమా తర్వాత బన్నీ మలయాళంలో సంచలనాలు సృష్టిస్తోన్న యంగ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడట. ప్రస్తుతం మలయాళంలో నటుడిగా, దర్శకుడిగా అద్భుతమైన విజయాలు అందుకుంటున్నారు బాసిల్ జోసెఫ్. 2021లో మిన్నల్ మురళీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.
ఆ తర్వాత జయ జయ జయ జయహే, సూక్ష్మదర్శిని, పోన్ మాన్ వంటి సినిమాలతో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాసిల్ జోసేఫ్ తెరకెక్కించిన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కేవలం మూడు సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన బాసిల్.. ఇప్పుడు నేరుగా బన్నీతో సినిమా చేయనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. త్వరలోనే వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. నిజానికి కేరళలో బన్నీకి విపరీతమైన క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. మలయాళీ ప్రేక్షకులు బన్నీని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో వైరల్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ నెలకొంది..
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..