మీయాపూర్లోని మయూరీనగర్లో హృదయవిదారక ఘటన జరిగింది. 37 ఏళ్ల ఈషా సాహు తన ఆరు నెలల బిడ్డను చంకనేసుకుని ఆరవ అంతస్థు నుండి దూకింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. అదృష్టవశాత్తు, చిన్నారి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి భవిష్యత్తుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.