Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tejaswini Pandit: ఆదిపురుష్ సినిమాలోని సూర్పనఖ నిజ జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొందా..!

ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే.. రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Tejaswini Pandit: ఆదిపురుష్ సినిమాలోని సూర్పనఖ నిజ జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొందా..!
Tejaswini Pandit
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 05, 2023 | 10:24 AM

ప్రభాస్ సినిమాల కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే.. రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతిసనన్ సీతగా కనిపించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో సూర్పనఖ గా నటించిన హీరోయిన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆదిపురుష్ సినిమాలో సూర్పనఖ గా నటించిన నటి పేరు తేజేస్విని పండిట్. అందం అభినయం ఈ అమ్మడు మరాఠీ సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది.

ఆది పురుష్ సినిమా తర్వాత ఈ అమ్మడి క్రేజ్ పెరిగింది. తేజేస్విని కోసం గూగుల్ లో గాలిస్తున్నారు నెటిజన్స్. ఇంత అందమైన సూర్పనఖ ఎవరా అని అంతా తెగ వెతికేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజేస్విని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఆది పురుష్ సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపింది. ఇప్పుడు నా గురించి నెటిజన్స్ గూగుల్ లో సర్చ్ చేస్తుంటే సంతోషంగా ఉంది అని అన్నారు. అలాగే తన చిన్న తనంలో ఎదుర్కొన్న కష్టాలు గురించి కూడా తెలిపారు తేజేస్విని. ఒకానొక సమయంలో తినడానికి తిండి కూడా లేదని ఆమె ఎమోషనల్ అయ్యారు. కనీసం ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదని.. అప్పులు మాత్రం చాలా ఉండేవి అని తెలిపారు. వాటన్నింటిని తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయని అన్నారు. అలాగే తన స్కూల్ స్నేహితుడిని 2012లో పెళ్ళాడనని కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయామని తెలిపింది తేజేస్విని పండిట్.