మత్తుకళ్లతో మతిపోగొడుతున్న శ్రియ రెడ్డి.. లైకులు వర్షం కురిపిస్తున్న కుర్రాళ్ళు
శ్రియ రెడ్డి.. టెలివిజన్ ప్రెజెంటర్, వీడియో జాకీ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు ఎక్కవగా తమిళం, తెలుగు సినిమాల్లో నటించింది. అంతే కాదు మాజీ భారత టెస్ట్ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తె ఆమె . శ్రియ తన నటనా జీవితాన్ని ప్రారంభించే వీడియో జాకీగా పనిచేసింది.ఈ బ్యూటీ 2002లో "సమురాయ్" అనే తమిళ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
Updated on: Mar 25, 2025 | 2:18 PM

శ్రియ రెడ్డి.. టెలివిజన్ ప్రెజెంటర్, వీడియో జాకీ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు ఎక్కవగా తమిళం, తెలుగు సినిమాల్లో నటించింది. అంతే కాదు మాజీ భారత టెస్ట్ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తె ఆమె . శ్రియ తన నటనా జీవితాన్ని ప్రారంభించే వీడియో జాకీగా పనిచేసింది.

ఈ బ్యూటీ 2002లో "సమురాయ్" అనే తమిళ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో సుమారు డజను సినిమాల్లో నటించింది. "బ్లాక్" , "తిమిరు", "కంచివరం", "సలార్: పార్ట్ 1 – సీజ్ఫైర్" లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇక తెలుగులో ఈ భామ మొదటి చిత్రం "అప్పుడప్పుడు". ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఆతర్వాత "బ్లాక్" చిత్రంలో మమ్ముట్టితో కలిసి నటించడం ద్వారా మలయాళంలో మంచి గుర్తింపు పొందింది.

శ్రియ 2008లో నటుడు మరియు నిర్మాత విక్రమ్ కృష్ణను వివాహం చేసుకుంది. విక్రమ్ కృష్ణ ప్రముఖ నిర్మాత G.K. రెడ్డి కుమారుడు. అలాగే నటుడు విశాల్ కృష్ణ సోదరుడు. వివాహం తర్వాత ఆమె తన భర్తతో కలిసి సినిమా నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది.

ఇటీవల "సలార్" చిత్రంలో రాధా రామ పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆమె తదుపరి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంలో కూడా కనిపించనుంది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ బ్యూటీ.




