AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Annapoorna: సుమ, రాజీవ్ పై అన్నపూర్ణ సంచలన కామెంట్స్ .. నేను ముందు పోతా.. వాళ్ళు ఇక్కడే ఉంటారా

Actress Annapoorna:తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ నటి అన్నపూర్ణ... హీరోయిన్ గా అడుగు పెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి .. ఇప్పటికీ అమ్మమ్మ క్యారెక్టర్ లో నటిస్తూనే..

Actress Annapoorna: సుమ, రాజీవ్ పై అన్నపూర్ణ సంచలన కామెంట్స్ .. నేను ముందు పోతా.. వాళ్ళు ఇక్కడే ఉంటారా
Actress Annapoorna
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2021 | 7:41 PM

Share

Actress Annapoorna: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ నటి అన్నపూర్ణ… హీరోయిన్ గా అడుగు పెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి .. ఇప్పటికీ అమ్మమ్మ క్యారెక్టర్ లో నటిస్తూనే ఉన్నారు. ఇటీవల అన్నపూర్ణ ఓ ఇంటర్వ్యూలో దేవదాస్ కనకాల ఫ్యామిలీ పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. తనను రాజీవ్ కనకాల తండ్రి.. దేవదాస్ కనకాల  ఓ భూమి విషయంలో మోసం చేశారంటూ చెప్పారు.  22 ఏళ్ల క్రితమే దేవదాస్ కనకాల తనకు భూమిని అమ్మారని.. తనకు అమ్మిన భూమినే మళ్లీ వెంచర్ వేసి వేరే వాళ్లకు అమ్మేశారని అన్నపూర్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి ఈ విషయంలో తాను కనకాల ఫ్యామిలీని అడుగుతూనే ఉన్నానని.. దేవదాసు కనకాల మరణించడం తో తన ల్యాండ్ ఇష్యుని రాజీవ్, సుమ కు చెప్పానని అయితే వారిద్దరూ అసలు పట్టించుకోలేదని చెప్పారు.

తన భూమి గురించి మాట్లాడడం కోసం ఒకసారి రాజీవ్ కు ఫోన్ చేశా.. అపుడు రాజీవ్ మంచిగానే స్పందించాడు. తర్వాత నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అని వస్తుంది.. దీంతో ఫోన్ పనిచేయడంలేదేమో అని ఒక తెలిసిన వ్యక్తిని అడిగా.. అప్పుడు అతను రాజీవ్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు.. అది నా దగ్గర ఉన్న నెంబర్ ఒకటే.. దీంతో అప్పుడు తెలిసింది. రాజీవ్ కు తనతో మాట్లాడం ఇష్టం లేక తన నెంబర్ ను బ్లాక్ లో పెట్టాడని.. దీంతో ఆ మధ్యవర్తిని భూమి విషయం రాజీవ్ ని అడగమని చెప్పా.. అయితే రాజీవ్ తనకు ఏమీ తెలియదు అంటున్నాడని మధ్యవర్తి చెప్పాడని అన్నపూర్ణ చెప్పారు. అంతేకాదు..

భూమి విషయం రాజీవ్ తెలియదు అంటున్నాడు..కానీ అప్పుడు అతను కూడా ఉన్నాడు.. నేను అంత భూమి అడగ లేదు.. ఎక్కడో చోట కొంత భూమి ఇవ్వమని అడిగాను రాజీ కొచ్చి అడిగితె.. దానికి కూడా సుమ రాజీవ్ లు అంగీకరించలేదు. దేవదాస్ కనకాల తనకు భూమిని అమ్మిన విషయం ఫ్యామిలీ అంతా తెలుసు.. కానీ తండ్రి మరణించడంతో ఏమీ తెలియదన్నట్లు ప్రవర్తిస్తున్నారు.. ఇప్పుడు ఆ భూమిని వాళ్ళేమైనా పట్టుకుని ఉంటారా.. నేను పట్టుకుని పోతానా.. ఎవరైనా కొంచెం వెనుక ముందు అందరం పోయేవాళ్లమే అని అన్నారు.. అంతేకాదు ఇది శాపం అనుకోండి.. ఏదైనా అనుకోండి అంటూ సుమ దంపతులపై అన్నపూర్ణ సంచలన కామెంట్స్ చేశారు.

Also Read : మానవత్వమా నీ చిరునామా ఎక్కడ? పనికి రాదని కన్నతల్లిని ఇంట్లోనుంచి గెంటేసిన తనయుడు..