AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌజ్‌ నుంచి వరుసగా మహిళలే ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు? కారణమిదేనా?

ఏడో సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన వారంతా మహిళలే ఉండడం గమనార్హం. మొదటి వారంలో కిరణ్‌ రాథోడ్‌, రెండో వీక్‌లో షకీలా, మూడో వారంలో సింగర్‌ దామినీ భట్ల, నాలుగో వీక్‌లో రతికా రోజ్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ఐదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా శుభశ్రీ రాయగురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి వరుసగా మహిళలే ఎలిమినేట్ కావడంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Bigg Boss 7 Telugu: 'బిగ్ బాస్' హౌజ్‌ నుంచి వరుసగా మహిళలే ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు? కారణమిదేనా?
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Oct 11, 2023 | 10:52 AM

Share

ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇప్పటికే ఐదో వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ గేమ్‌ షో ఆరో వారంలోకి ప్రవేశించింది. సెప్టెంబర్‌ 3న ఏడో సీజన్‌ ప్రారంభం కాగా.. తాజాగా మినీ లాంచ్‌ కూడా జరిగింది. ఐదుగురు కంటెస్టెంట్లు బయటకు పోగా మరో ఐదుగురు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో హౌజ్‌లోకి అడుగుపెట్టారు. కాగా ఏడో సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన వారంతా మహిళలే ఉండడం గమనార్హం. మొదటి వారంలో కిరణ్‌ రాథోడ్‌, రెండో వీక్‌లో షకీలా, మూడో వారంలో సింగర్‌ దామినీ భట్ల, నాలుగో వీక్‌లో రతికా రోజ్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ఐదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా శుభశ్రీ రాయగురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి వరుసగా మహిళలే ఎలిమినేట్ కావడంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. బిగ్‌బాస్‌ కావాలనే ఉమెన్‌ కంటెస్టెంట్స్‌ను బయటకు పంపిస్తున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో అలాంటిదేమి ఉండదని ఓటింగ్‌ ప్రకారమే ఎలిమినేషన్‌ జరుగుతుందంటున్నారు.

నామినేషన్‌ లిస్టులో నిలిచిన మహిళలలకు ఓట్లు తక్కువగా వస్తున్నాయని అందుకే హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఇప్పటివరకు బిగ్‌బాస్‌ ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా, పురుషులే టైటిల్‌ విజేతగా నిలుస్తున్నారు. మహిళా కంటెస్టెంట్లు ఫైనల్‌ దాకా వస్తున్నా బిగ్‌ బాస్‌ ట్రోఫీ మాత్రం గెల్చుకోలేకపోతున్నారు.మరి ఈ సీజన్‌లో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందా? లేక వుమెన్‌ కంటెస్టెంట్లు విజేతగా నిలుస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి. కాగా ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్‌ దీప్‌, ఆట సందీప్‌, శోభాశెట్టి, టేస్టీ తేజా,ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌ కృష్ణ, అశ్విని, షావలి, పూజా మూర్తి, పావని హౌజ్‌లో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

 ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది వీరే..

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో…

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..