సుశాంత్ మైనపు బొమ్మ తయారీ.. కీలక వ్యాఖ్యలు చేసిన కళాకారుడు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మైనపు బొమ్మను లండన్లోని మేడమ్ తుస్సాడ్స్లో ఏర్పాటు చేసేందుకు అతడి అభిమానులు

Sushant Wax statue: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మైనపు బొమ్మను లండన్లోని మేడమ్ తుస్సాడ్స్లో ఏర్పాటు చేసేందుకు అతడి అభిమానులు ఆన్లైన్ క్యాంపెయిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఈ పిటిషన్పై సంతకం చేశారు. ఇక ఇది కార్యరూపం దాల్చేందుకు చాలా సమయమే పట్టనుంది. ఈ క్రమంలో ఓ అడుగు ముందుకేసి సుశాంత్ మైనపు బొమ్మను తయారు చేశారు ప్రముఖ మైనపు బొమ్మల తయారీ కళాకారుడు సుకంతో రాయ్. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్కి చెందిన ఈ కళాకారుడు తన ఇంట్లో ఈ బొమ్మను తయారు చేశారు.
ఈ సందర్భంగా సుకంతో రాయ్ మాట్లాడుతూ.. ”సుశాంత్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మరణించడం నన్ను బాధించింది. నా మ్యూజియం కోసం ఈ బొమ్మను తయారు చేశా. ఒకవేళ సుశాంత్ కుటుంబం కావాలంటే వారి కోసం ప్రత్యేకంగా ఓ బొమ్మను తయారు చేస్తా” అని తెలిపారు. ఇదిలా ఉంటే సుశాంత్ కేసులో సీబీఐ, ఎన్సీబీ, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసును త్వరగా దర్యాప్తు చేసి సుశాంత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అభిమానులు కోరుతున్నారు.
Read More:
‘ఛలో అంతర్వేది’కి అనుమతుల్లేవు: డీఐజీ
బడా మాల్స్, షోరూంలకు జీహెచ్ఎంసీ జరిమానా.. ఎందుకంటే
https://twitter.com/ANI/status/1306744511255592960/photo/3



