AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ఆ కేసులో ప్రముఖ కామెడి కింగ్‏కు సమన్లు.. ముంబై క్రైం బ్రాంచ్ ఆఫీసుకి వెళ్ళిన హస్యనటుడు..

బాలీవుడ్ కామెడి కింగ్ కపిల్ శర్మ ఓ కేసులో ఇరుక్కుపోయాడు. గురువారం ముంబై క్రైం ఇంటెలిజెన్స్ సంస్థ ఆయనకు సమన్లు ఇచ్చింది. ఇటీవల ముంబై పోలీసులు స్వాధీనం

Mumbai: ఆ కేసులో ప్రముఖ కామెడి కింగ్‏కు సమన్లు.. ముంబై క్రైం బ్రాంచ్ ఆఫీసుకి వెళ్ళిన హస్యనటుడు..
Rajitha Chanti
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 07, 2021 | 7:02 PM

Share

బాలీవుడ్ కామెడి కింగ్ కపిల్ శర్మ ఓ కేసులో ఇరుక్కుపోయాడు. గురువారం ముంబై క్రైం ఇంటెలిజెన్స్ సంస్థ ఆయనకు సమన్లు ఇచ్చింది. ఇటీవల ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ రిజస్టర్డ్ కార్ల కేసులో కపిల్ స్టెట్‏మెంట్ కోసం ఏపీఐ సచిన్ వాజ్ ఆయనను పిలిచినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం మధ్యాహ్నం కపిల్ ముంబై క్రైం బ్రాంచ్ ఆఫీసులో హజరయ్యారు. ఆ తర్వాత కపిల్ శర్మ మీడియాతో మాట్లాడారు. “నా వానిటీ వ్యాన్ కారు తయారీ కోసం ప్రముఖ కార్ల డిజైనర్ దిలీప్ చాబ్రియాకు డబ్బులు ఇచ్చాను. కానీ అతను డబ్బులు తీసుకొని నా కారు డిజైన్ చేయలేదు. అదే విషయమై ఇటీవల నేను ఎంసీయు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేసు విచారణలో భాగంగా నా వాంగ్ములం తీసుకునేందుకు పోలీసులు పిలిచారు” అని చెప్పారు.

Also Read:

Anushka Sharma: ఫోటోగ్రాఫర్‏పై విరుచుకుపడిన అనుష్క.. ఎన్నిసార్లు చెప్పినా మారరా.. ఇప్పుడే ఇది ఆపండి అంటూ..

Jigarthanda Remake: ‘జిగర్తాండ’ సినిమా హిందీ రిమేక్ షూటింగ్ ప్రారంభించిన సినీ యూనిట్.. హీరోగా ఆ స్టార్ ..