కళ్ళకు గంతలు కట్టుకొని దోశ తిరగేసిన మెగాస్టార్.. సినిమా చూస్తూ ఏడ్చేశానంటున్న చిరంజీవి..
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదిగిన సమంత ప్రస్తుతం ఆహ ఓటీటీలో 'సామ్జామ్' అనే టాక్ షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు పాల్గొని సందడి చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదిగిన సమంత ప్రస్తుతం ఆహ ఓటీటీలో ‘సామ్జామ్’ అనే టాక్ షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు పాల్గొని సందడి చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఇందులోకి మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సమంత అడిగిన ప్రశ్నలకు చిరు నవ్వుతూ సమాధానాలు చెప్పారు. మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చేశారా అంటూ సమంత అడగ్గా.. ఓ సినిమాకు వెళ్ళి ఏడ్చానని తెలిపారు. అనంతరం కిందకు వంగి కళ్ళు తుడుచుకుంటూ ఉండగా.. థియోటర్ వాళ్ళు లైట్స్ వేశారని.. తాను పైకి లేచేసరికి పైట తన చేతిలో ఉందని తెలిపారు. ఆ తర్వాత చేతులు, కాళ్ళు లేని బాలుడు తన నోటితో చిరంజీవి మెయింట్ వేశాడు. అది చూసి ఆ బాలుడిని సంతోషంగా మెచ్చుకున్నారు చిరు. అనంతరం కళ్ళకు గంతలు కట్టుకొని దోశను తిరగేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 నుంచి ఈ షో రాబోతోంది.