Salman Khan : సల్మాన్ ఖాన్ విచారణకు హాజరుకావాల్సిందే.. ఆదేశించిన జోధ్పూర్ హైకోర్టు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసు నడుస్తూనే ఉంది.
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసు నడుస్తూనే ఉంది. 1998 అక్టోబర్ లో జోధ్పూర్లో జింకలను వేటాడినందుకు ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్కు 2018 మార్చిలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత జోధ్పూర్ లోని జిల్లా సెషన్స్ కోర్టుకు ఈ కేసు వెళ్ళింది. స్టే విధించిన న్యాయస్థానం 2018లో సల్మాన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కాగా ఇప్పుడు ఈ కేసు మరోసారి కోర్టు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఖాన్ విచారణకు హాజరు కావాలని జోధ్పూర్ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ విచారణకు సల్మాన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరాడు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 6 న తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :