AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెట్టింట్లో వైరల్ అవుతున్న మామ,అల్లుళ్ల ఫొటో.. దీనికి కారణం తెలియజేసిన సుప్రీం హీరో..

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన గుర్తింపుతో దూసుకెళుతున్నాడు సాయి ధరమ్ తేజ్.

నెట్టింట్లో వైరల్ అవుతున్న మామ,అల్లుళ్ల ఫొటో.. దీనికి కారణం తెలియజేసిన సుప్రీం హీరో..
uppula Raju
|

Updated on: Dec 22, 2020 | 1:39 PM

Share

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన గుర్తింపుతో దూసుకెళుతున్నాడు సాయి ధరమ్ తేజ్. రేయ్ సినిమాతో మొదలు పెట్టిన సినీ ప్రస్థానం సోలో బ్రతుకే సో బెట‌ర్ వరకు కొనసాగుతోంది. మొదట్లో కొద్దిగా ఇబ్బందిపడినా.. విజయాల చేరువతో ప్రస్తుతం స్థిరంగా ఉన్నాడు. అయితే సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్‌లకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

డిసెంబ‌ర్ 9న నిహారిక‌-చైతన్య పెళ్లి జ‌ర‌గ‌గా, ఆ వేడుక‌కి హాజ‌రైన తేజూ ఓ సంద‌ర్భంలో ప‌వ‌న్ చేతిని ప‌ట్టుకొని న‌వ్వుతూ క‌నిపించాడు. వీరిద్దరు క‌లిసి ఉన్న ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఏ సంద‌ర్భంలో ఇది జ‌రిగిందా అని నెటిజ‌న్స్ జుట్టు పీక్కుంటున్నారు. దీంతో సాయి ధరమ్ తేజ్ దీనికి వివరణ ఇచ్చాడు. సోలో బ్రతుకే సో బెటర్ ప్రమోషన్ జరగుతున్నప్పుడు ఈ పొటో గురించిన వివరాలను వెల్లడించాడు. తాను పవన్ మామ ని ఓ ఫొటో అడిగానని, దానికి ఆయ‌న ఏరా ఇంతముందెప్పుడు నాతో ఫొటో దిగ‌లేదా అన్నారని చెప్పారు. ఆ స‌మ‌యంలో మా ఇద్దరి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణలో భాగంగా ఈ ఫొటో వచ్చిందని తెలిపారు.