AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొల్లగొడుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్.. లెక్కలు చూస్తే చుక్కలే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహోపై కనీవినీ ఎరుగని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్, ప్రభాస్ జంటగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో అమిర్, షారుఖ్, సల్మాన్ చిత్రాల తరహాలో సాహో చిత్రానికి క్రేజ్ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాహుబలి తరువాత ప్రభాస్ మరోసారి అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కిన సాహో ప్రీ […]

కొల్లగొడుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్.. లెక్కలు చూస్తే చుక్కలే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2019 | 2:29 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహోపై కనీవినీ ఎరుగని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్, ప్రభాస్ జంటగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో అమిర్, షారుఖ్, సల్మాన్ చిత్రాల తరహాలో సాహో చిత్రానికి క్రేజ్ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాహుబలి తరువాత ప్రభాస్ మరోసారి అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కిన సాహో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లోనూ రికార్డ్‌లు సృష్టిస్తోంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌లోనే అంత మొత్తాన్ని వెనక్కి రాబట్టే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు.

అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే సాహో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ. 330 కోట్లకు పైగా జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ రూ.125 కోట్లు పలికాయట. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు మొత్తం కలిపి రూ. 46 కోట్లు పలకగా హిందీ వర్షన్‌ దాదాపు రూ.120 కోట్లకు అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకు అమ్ముడైన ఓవర్‌సీస్‌ లెక్కలు రూ.42 కోట్లుగా తెలుస్తోంది. ఇవి కాక శాటిలైట్‌, డిజిటల్‌, ఆడియో రైట్స్‌ రూపంలో భారీ మొత్తం వచ్చే అవకాశం ఉంది. ఇవన్ని చూస్తుంటే సాహో, బాహుబలి రికార్డ్‌లను సైతం తుడిచిపెట్టే ఛాన్స్‌ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు.