Renu Desai: పవన్‌, అకీరాతో దిగిన ఫొటోను షేర్‌ చేసిన రేణు దేశాయ్‌.. వైరల్‌ అవుతోన్న ఎమోషనల్‌ పోస్ట్‌..

Renu Desai: పవన్‌ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటోన్న రేణు ప్రస్తుతం కుమారుడు అకీరా నందన్‌, కూతురు ఆద్యతో పుణేలో నివసిస్తోన్న విషయం తెలిసిందే. అయితే పవన్‌ అప్పుడప్పుడు అకీరాతో దిగిన...

Renu Desai: పవన్‌, అకీరాతో దిగిన ఫొటోను షేర్‌ చేసిన రేణు దేశాయ్‌.. వైరల్‌ అవుతోన్న ఎమోషనల్‌ పోస్ట్‌..
Follow us

|

Updated on: May 24, 2022 | 6:20 AM

Renu Desai: పవన్‌ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటోన్న రేణు ప్రస్తుతం కుమారుడు అకీరా నందన్‌, కూతురు ఆద్యతో పుణేలో నివసిస్తోన్న విషయం తెలిసిందే. అయితే పవన్‌ అప్పుడప్పుడు అకీరాతో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. కానీ తాజాగా రేణుతో కలిసి దిగిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా పవన్‌, రేణుల కుమారుడు అకీరా నందన్‌ గ్రాడ్యుయేషన్‌ డే జరిగింది. ఈ కార్యక్రమానికి రేణుతో పాటు పవన్ కళ్యాణ్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో కూతురు ఆద్య కూడా ఉండడం విశేషం.

ఇక ఈ ఫొటోతో పాటు రేణు ఓ ఎమోషనల్‌ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. అకీరా స్కూల్‌ డేస్‌ పూర్తి చేసుకున్న విషయాన్ని ప్రస్తావించిన రేణు.. ‘అకీరా జీవితంలో ఒక స్టేజ్‌ పూర్తయి మరో స్టేజ్‌ మొదలైంది. అకీరా పట్ల తల్లిదండ్రులుగా మాకు గర్వంగా ఉంది. ఇప్పటి నుంచి ఉదయాన్నే స్కూలుకు రడీ అవ్వాలన్న టెన్షన్‌ లేదు. స్కూల్‌ బస్‌ కోసం తొందర పడే బాధా లేదు. సమయానికి టిఫిన్ సిద్దం చేయాల్సిన అవసరం లేదు. ట్యూషన్ లేదు అసలు స్కూలే లేదు. నీ అసలైన జర్నీ మొదలైంది అని అకీరా కు చెప్పాను. అకీరా మా ప్రమేయం లేకుండానే సొంతంగా తన దారిని వెతుక్కుంటాడని నాకు నమ్మకం ఉంది’ అంటూ రాసుకొచ్చారు.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

ఇక రేణు దేశాయ్‌ ఇలా పోస్ట్‌ చేశారో లేదో అలా లైక్‌ల వర్షం కురుస్తోంది. అభిమానులు భారీ ఎత్తున లైక్‌ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రేణు ఈ పోస్ట్‌కు కామెంట్‌ సెషన్‌ను ఆఫ్‌ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..