Nithin’s Maestro: నితిన్ మాస్ట్రో మూవీ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్… డిజిటల్ లో రిలీజ్ కు రంగం సిద్ధం..?
Nithin's Maestro:దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించింది. దీంతో ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణమే.
Nithin’s Maestro:దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించింది. దీంతో ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణమే. దర్శనమిస్తుంది. దీంతో సినిమాల రిలీజ్ గురించి ఆలోచించడం కష్టమే.. అయితే సినీ ప్రియులకు ఓటిటి రూపంలో మంచి వినోద సాధనం అందుబాటులోకి వచ్చింది. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో సూర్య వంటి స్టార్ హీరోలతో పాటు అనేక చిన్న సినిమాలు కూడా ఓటిటి లో రిలీజై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి., తాజాగా నితిన్ మూవీ కూడా ఓటిటి లో రిలీజ్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.
గత ఏడాది లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత నితిన్ చెక్ , రంగ్ దే సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి. అయితే ప్రస్తుతం నితిన్ మరో మూవీ మాస్ట్రో సెట్స్ మీద ఉంది. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ‘అంధాధూన్’కు ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మిల్కిబ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తుండగా … నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ దీనికి సమర్పకుడు. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం కేవలం ఏడు రోజుల షూటింగ్ మాత్రం బాలెన్స్ ఉందట. . జూన్ రెండో వారంలో షూటింగ్ పూర్తి చేసి.. ఇదే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మాస్ట్రో మూవీకి ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందట. ఓ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో ‘మ్యాస్ట్రో’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే… దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే విడుదలైన నితిన్ ఫస్ట్లుక్, గ్లింప్స్కు మంచి స్పందన లభిస్తోంది.
Also Read: కరోనా బాధితులు ఊపిరితిత్తులకు సింపుల్ చిట్కాలతో ఊపిరినివ్వండి ఇలా…!