AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha: మొదలైన ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 2 హంగామా.. ఈసారి జడ్జీలుగా ఎవరు ఉండనున్నారంటే..

మారుతీ.. వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి లాంటి టాలెంటెడ్ సింగర్స్ ఇచ్చిన షో సెమీ ఫైనల్స్ కు బాలయ్య అతిథిగా రాగా.. ఫైనల్ కు మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఇందులో సింగర్ వాగ్దేవి విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ షో సెకండ్ సీజన్ రాబోతుంది. ఇప్పుడే సీజన్ 2 హంగామా షూరు అయ్యింది.

Aha: మొదలైన ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 2 హంగామా.. ఈసారి జడ్జీలుగా ఎవరు ఉండనున్నారంటే..
Indian Idol Telugu
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2023 | 9:03 PM

Share

డిజిటల్ ప్లాట్ ఫాం పై మరోసారి సింగర్స్ వార్ స్టార్ట్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ మాధ్యామం ఆహాలో సూపర్ హిట్ అయిన షోలలో ఇండియన్ ఐడల్ తెలుగు ఒకటి. ఈ షో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. గతంలో సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యామీనన్.. సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించి సందడి చేశారు. అలాగే మారుతీ.. వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి లాంటి టాలెంటెడ్ సింగర్స్ ఇచ్చిన షో సెమీ ఫైనల్స్ కు బాలయ్య అతిథిగా రాగా.. ఫైనల్ కు మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఇందులో సింగర్ వాగ్దేవి విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ షో సెకండ్ సీజన్ రాబోతుంది. ఇప్పుడే ఆహాలో సీజన్ 2 హంగామా షూరు అయ్యింది.

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 మరింత గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ గ్రాండ్ లాంచ్ షూటింగ్ కు తమన్ అతిథిగా విచ్చేశారు. అయితే ఈ సెకండ్ సీజన్ లాంచ్ ఈవెంట్ కు నిత్య మీనన్ కనిపించలేదు. దీంతో సీజన్ 2లో ఆమె ఉంటుందా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అలాగే సింగర్ కార్తిక్ కూడా ఉండనున్నారా ? అనేది తెలియాల్సి ఉంది. హోస్ట్ గా ఈసారి కూడా శ్రీరామచంద్ర ఉంటాడా ? లేదా మరో సింగర్ రాబోతున్నారా ? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. త్వరలోనే సీజన్ 2కు సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించున్నారు ఆహా మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.