Venkatesh: ఇప్పుడేం సినిమాలు లేవు.. ఖాళీగా ఉన్నా సంతోషంగానే ఉన్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన వెంకటేశ్..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో రీమేక్ చిత్రాల హావా నడుస్తుంది. ఇతర భాషల నుంచి రీమేక్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి

Venkatesh: ఇప్పుడేం సినిమాలు లేవు.. ఖాళీగా ఉన్నా సంతోషంగానే ఉన్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన వెంకటేశ్..
Venkatesh
Follow us

|

Updated on: Nov 18, 2021 | 8:36 PM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో రీమేక్ చిత్రాల హావా నడుస్తుంది. ఇతర భాషల నుంచి రీమేక్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. తెలుగులోనూ రీమేక్ చిత్రాలకు కొదవ లేదు. ఇప్పుడు స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరి దృష్టి రీమేక్ సినిమాలవైపే ఉంది. అలా ఇప్పటివరకు తెలుగులో ఎక్కువగా రీమేక్ చిత్రాల్లో నటించిన స్టార్ హీరోలలో వెంకటేశ్ ఒకరు. ఇటీవల నారప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకున్నాడు. నారప్ప సినిమా విడుదలైంది ఓటీటీలోనే అయినా.. ఆ చిత్రానికి రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక తాజాగా మరో రీమేక్ సినిమా దృశ్యం 2 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన దృశ్యం సినిమాకు సిక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది.

దృశ్యం 2 మూవీ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 25న స్ట్రీమింగ్ కానుంది. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. ఇక సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. తాజాగా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు.

వెంకటేశ్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు రాంబాబు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాం బాబు ముఖ్య ఉద్దేశ్యం. అలాంటి పాత్రలో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. సీక్వెల్ చేస్తే సినిమా హిట్ అవుతుందా? లేదా? అని అందరిలోనూ కొన్ని అనుమానాలుంటాయి. కానీ జీతూ జోసెఫ్ మాత్రం మొదటి పార్ట్ కంటే అద్భుతంగా స్క్రిప్ట్ రాశారు. రాంబాబు ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడా? అని జనాలు అనుకుంటారు. అంతా బాగుందని అనుకునే సమయంలో ఆరేళ్ల తరువాత ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడం, మళ్లీ సమస్యలు రావడం.. సీటు అంచును కూర్చోబెట్టే సినిమాలు అంటారు కదా?..అలా ఉంటుంది సినిమా. ఏం జరిగిందనేది ఫ్యామిలీకి కూడా చెప్పడు. ఫ్యామిలినీ రక్షించడం మాత్రం తెలుసు. ఇది చాలా గొప్ప పాత్ర. మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. రాంబాబు పాత్రలో మ‌రోసారి న‌టించ‌డం చాలా హ్యాపీ..

దాదాపు ఒరిజినల్‌లానే ఉంటుంది. ఎక్కువ మార్పులు చేర్పులు చేయలేదు. కొత్తగా నాలుగైదు సీన్లు యాడ్ చేశాం. మొదటి పార్ట్ చూడకపోయినా దృశ్యం 2 అర్థమవుతంది. ఒకవేళ మొదటి పార్ట్ చూడాలని అనుకున్నా కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. సినిమా చేయడం వరకే నా బాధ్యత. విడుదల విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను. తప్పూ ఒప్పూ అని ఏమి ఉండదు. పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్లిపోవాలి. ఇంకా చాలా సినిమాలు థియేటర్లో కూడా వస్తాయి. ఈ సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేశాం.

సినిమాలు తీశామా? రిలీజ్ చేశామా? అంతే.. ఎంజాయ్ చేసే వాళ్లు ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. మనం ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఇలాంటి చిత్రాలు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎంత మంది చూస్తారు అని కాదు కానీ..ఈ బడ్జెట్‌కు ఓటీటీ బెస్ట్ అని నిర్మాతలు అనుకున్నారేమో. నా అభిమానులు కాస్త హర్ట్ అవుతారేమో కానీ.. నెక్ట్స్ సినిమాల‌తో థియేటర్లోకి వస్తాను అని వాళ్లకు తెలుసు. అన్నింటికి ఓపిగ్గా ఉండాలి. ఈ సారి ఇలా జరిగిందంతే. అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే చిత్రాలను చేయబోతోన్నాను. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాను. నేను ఇలాంటి చిత్రాలే చేయలని అనుకోను. నా దగ్గరకు వచ్చిన సినిమాలు మాత్రమే నేను చేస్తాను.

దృశ్యంకి మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈ సారి మాత్రం చాలా టైం పడుతుందని మాత్రం చెప్పారు. మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవ‌స‌రం లేదు. నేను ఎప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించను. అదృష్టం కొద్దీ ఈ రంగంలోకి వచ్చాను. ప్రేక్షకుల అభిమానం దొరికింది. ఇంకా చూపిస్తూనే ఉన్నారు. కొత్తగా చేసేందుకు ట్రై చేసేందుకే ప్రయత్నిస్తున్నాను. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే బాధ ఎఫ్ 3తో పోతుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నా అభిమానులు అర్థం చేసుకుంటారు. వారి ఓపిగ్గా ఉంటారు. ఎఫ్ 3 డబ్బు చుట్టూ సినిమా తిరుగుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ అదే అవ‌స‌రం క‌దా..అందుకే త‌ప్పకుండా క‌నెక్ట్ అవుతుంది. దాదాపు షూటింగ్ పూర్తయింది. సమ్మర్‌లో సినిమా వచ్చే అవకాశాలున్నాయి.

ఎక్కువగా ఏమీ ఆశించొద్దు. వచ్చిన దాన్ని స్వీకరించాలి. ఫీడ్ బ్యాక్ అనే దాంట్లో ప్లస్, మైనస్‌లుంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని పాఠాలు నేర్చుకోవాలి. రిలీజ్ అయిన వెంటనే కాకుండా ఓ ఆరు నెలల తరువాత కూడా సినిమాలు చూస్తారు. బాగుందని అంటారు. ఓటీటీలోని అందం అదే. కొన్ని సినిమాలు వెంటనే చూస్తారు. కొన్ని మెల్లిగా చూస్తారు. థియేటర్లోంచి సినిమా వెళ్లి పోతుంద‌ని ముందు చూస్తారు. కానీ ఓటీటీలో తీరిగ్గా త‌ర్వాతైనా చూస్తారు. చాలామంది యువ దర్శకులు కథలు వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకీ సంతకం చేయలేదు. ఖరారైన వెంటనే ఆ వివరాల్ని తెలియజేస్తా. ప్రస్తుతానికి రానాతో కలిసి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ ప్రాజెక్టులో నటిస్తున్నా. అవకాశం వచ్చినప్పుడు దానికోసం 100 శాతం కష్టపడదాం. పని లేనప్పుడు ఖాళీగా హ్యాపీగా ఉందాం. ప్రపంచాన్ని చుట్టేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. వీటికి మించింది ఏముంది?.. అనే ఆలోచనతో ముందుకు సాగుతుంటా అని అన్నారు.

Also Read:  Sivakarthikeyan: ఆ యంగ్ హీరోకు భారీగా డిమాండ్.. ఒక్క సినిమా రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..