AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేషనల్ అవార్డు విన్నర్‌తో ‘మహానటి’.. అధికారిక ప్రకటన

జాతీయ అవార్డు గ్రహీతతో ‘మహానటి’ కీర్తి సురేశ్ తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలకపాత్రలలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ వికారాబాద్, పుణెలలో షూటింగ్ జరుపుకోనుంది. సుధీర్ చంద్ర నిర్మించనున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. […]

నేషనల్ అవార్డు విన్నర్‌తో ‘మహానటి’.. అధికారిక ప్రకటన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 27, 2019 | 2:33 PM

Share

జాతీయ అవార్డు గ్రహీతతో ‘మహానటి’ కీర్తి సురేశ్ తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలకపాత్రలలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ వికారాబాద్, పుణెలలో షూటింగ్ జరుపుకోనుంది. సుధీర్ చంద్ర నిర్మించనున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సెప్టెంబర్ 2019లో విడుదల కానుంది. కాగా హైదరాబాదీ అయిన నగేశ్ కుకునూర్‌కు తెలుగులో మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.