నేషనల్ అవార్డు విన్నర్‌తో ‘మహానటి’.. అధికారిక ప్రకటన

జాతీయ అవార్డు గ్రహీతతో ‘మహానటి’ కీర్తి సురేశ్ తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలకపాత్రలలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ వికారాబాద్, పుణెలలో షూటింగ్ జరుపుకోనుంది. సుధీర్ చంద్ర నిర్మించనున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. […]

నేషనల్ అవార్డు విన్నర్‌తో ‘మహానటి’.. అధికారిక ప్రకటన
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2019 | 2:33 PM

జాతీయ అవార్డు గ్రహీతతో ‘మహానటి’ కీర్తి సురేశ్ తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలకపాత్రలలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ వికారాబాద్, పుణెలలో షూటింగ్ జరుపుకోనుంది. సుధీర్ చంద్ర నిర్మించనున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సెప్టెంబర్ 2019లో విడుదల కానుంది. కాగా హైదరాబాదీ అయిన నగేశ్ కుకునూర్‌కు తెలుగులో మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.