శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పెనుగొండ లోని ప్రముఖ ఆర్య వైశ్యుల పుణ్యక్షేత్రం శ్రీ వాసవీ మాత కు భక్తుల రద్దీ పెరుగుతుంది. దేశ నలుమూలల నుంచి పెద్దఎత్తున తేలివస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా లో ఏర్పాటైన శాంతి ధాంలో లోని 90 అడుగుల శ్రీ వాసవీ మాత పంచలోహ విగ్రహానికి భక్తి శ్రద్ధలతో భారీ రుద్రాక్ష మాలను అలంకరించారు భక్తులు.
పెనుగొండ లోని ప్రముఖ ఆర్య వైశ్యుల పుణ్యక్షేత్రం శ్రీ వాసవీ మాత కు భక్తులు తమకు తోచిన విధంగా విలువైన కానుకలు సమర్పిస్తూ తమ తమ భక్తిని చాటుకుంటుంటారు. అదే విధంగా రేపల్లె కు చెందిన మహిళా సంఘం సభ్యులు తమ 102 ఋషి గోత్రాల నామాలతో ప్రత్యేకంగా రూపొందించిన భారీ రుద్రాక్ష మాలను శ్రీ వాసవీ మాతకు సమర్పించారు. మొదట ఆలయ ప్రాంగణానికి మాలను తీసుకువచ్చిన మహిళా సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య 90 అడుగుల పంచ లోహ విగ్రహానికి ఆ రుద్రాక్ష మాలను అలంకరించారు. ఈ ఆధ్యాత్మిక దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి దర్శించుకున్నారు. శ్రీశ్రీ వాసవీ మాత ఆశీస్సులతో సమాజం సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో భక్తి భావాన్ని నింపింది.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

