AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mollywood 2024: మలయాళ ఇండస్ట్రీ కాదు.. మాయల ఇండస్ట్రీ అది..!

మలయాళ ఇండస్ట్రీలో చిన్న పాయింట్స్ పట్టుకుని సినిమాలు చేస్తున్నారు. ఇగోలు, గురకలు, పార్కింగ్‌లు ఇలా కథకు ఏదీ కాదు అనర్హం అన్నట్లు సాగుతుంది మలయాళ ఇండస్ట్రీ దూకుడు. ఆల్రెడీ మలయాళ సినిమాలను చూసి మిగిలిన ఇండస్ట్రీల కడుపు మండుతుంది. పైకి చెప్పట్లేదు కానీ అలా ఎలా తీస్తున్నార్రా సామీ అనుకుంటున్నారు. మలయాళ ఇండస్ట్రీ టాప్ ఫామ్‌లో ఉందిప్పుడు.

Mollywood 2024: మలయాళ ఇండస్ట్రీ కాదు.. మాయల ఇండస్ట్రీ అది..!
Malayalam Movies
Praveen Vadla
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 26, 2024 | 7:49 PM

Share
మలయాళ సినిమాలను.. అక్కడి ఇండస్ట్రీని చూసిన తర్వాత అంతా ఇదే అంటున్నారిప్పుడు. ఎందుకంటే అక్కడ వస్తున్నంత డిఫెరెంట్ కథలు ఎక్కడా రావట్లేదు. వాళ్ళు రాస్తున్న తీరు కూడా చాలా అద్భుతంగా కొత్తగా ఉంటుంది. చిన్న పాయింట్స్ పట్టుకుని సినిమాలు చేస్తున్నారు. ఇగోలు, గురకలు, పార్కింగ్‌లు ఇలా కథకు ఏదీ కాదు అనర్హం అన్నట్లు సాగుతుంది మలయాళ ఇండస్ట్రీ దూకుడు. ఆల్రెడీ మలయాళ సినిమాలను చూసి మిగిలిన ఇండస్ట్రీల కడుపు మండుతుంది. పైకి చెప్పట్లేదు కానీ అలా ఎలా తీస్తున్నార్రా సామీ అనుకుంటున్నారు. మలయాళ ఇండస్ట్రీ టాప్ ఫామ్‌లో ఉందిప్పుడు. లెజెండ్‌లో బాలయ్య ఒకడు వాళ్లకు ఎదురెళ్లినా.. వాళ్లకు ఒకడు ఎదురొచ్చినా కేరళ సినిమాల దెబ్బకు మటాష్ అయ్యేలా ఉన్నారు. అంతగా కాసుల వర్షం కురిపిస్తున్నారు అక్కడి సినిమాలు.
2024లో అయితే తొలి 5 నెలల్లోనే రూ.1000 కోట్లు వసూలు చేసింది మలయాళ ఇండస్ట్రీ. ఇండియాలో ఏ ఇండస్ట్రీకి సాధ్యం కాలేదు ఈ రికార్డ్. తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలన్నీ కలిపి రూ.600 కోట్లకు పైగా వసూలు చేసాయి. తమిళంలో 2024లో రిలీజైన అన్ని సినిమాలు కలిపితే కనీసం 400 కోట్ల మార్క్ కూడా దాటలేదు. ఇక హిందీలోనూ ఫైటర్, సైతాన్, క్య్రూ లాంటి సినిమాలు కలిపి రూ.950 కోట్ల వరకు వసూలు చేసాయి. కన్నడ ఇండస్ట్రీ కూడా 300 కోట్ల లోపే కలెక్ట్ చేసింది. అయితే సెకండాఫ్‌లో టాలీవుడ్ జూలు విదిల్చింది. కల్కి, దేవర సినిమాలే దాదాపు 1600 కోట్లు వసూలు చేసాయి. కానీ మలయాళ ఇండస్ట్రీ మాత్రం తొలి 5 నెలల్లోనే మంజుమ్మల్ బాయ్స్ 250 కోట్లు.. ప్రేమలు 140 కోట్లు.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం 150 కోట్లు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడుజీవితం 175 కోట్లు.. మమ్ముట్టి భ్రమయుగం 75 కోట్లు.. టొవీనో థామస్ అన్వేషిప్పన్ కొండెతుమ్ 50 కోట్లు వసూలు చేసాయి. 2024లో ఈ సినిమాల కలెక్షన్స్ అన్నీ కలిపితే 1000 కోట్లు దాటిపోయింది. మొత్తానికి తాబేలు కుందేలు కథలా అన్ని వుడ్స్‌ను మెల్లగా క్రాస్ చేస్తుంది మాలీవుడ్.
మరీ ముఖ్యంగా ఈ మధ్య థ్రిల్లర్ సినిమాకు పెట్టింది పేరుగా మారిపోతుంది మలయాళం సినిమా. పదేళ్ళ కింద దృశ్యంతో మొదలైంది అక్కడ ఈ ట్రెండ్. ఆ తర్వాత చాలా సినిమాలు ఇదే కోవలో వచ్చాయి. ఈ మధ్యే కిష్కింద కాండం అనే సినిమా వచ్చింది. తెలుగులో రిలీజ్ కాకపోయినా హైదరాబాద్ జనాలు ఎగబడి మరీ చూసారు. తాజాగా సూక్ష్మదర్శిని అనే సినిమాను సైతం ఓటిటిలో అలాగే చూస్తున్నారు. అంటే సుందరానికిలో హీరోయిన్‌గా నటించిన నజ్రియా ఇందులో కీలక పాత్ర పోషించింది. పక్కింట్లో ఉన్న బామ్మ హఠాత్తుగా మాయం కావడంతో.. ఆమె కొడుకు మాన్యుయెల్‌పై డిటెక్టివ్ అయిన నజ్రియా అనుమాన పడుతుంది. అక్కడ్నుంచి తిరిగే మలుపులే ఈ సినిమా కథ. చిన్న చిన్న లైన్స్ తీసుకుని అద్భుతాలు చేస్తున్నారు మలయాళ మేకర్స్. కోటి రూపాయల బడ్జెట్‌తో సినిమాలు చేసి.. 50 కోట్లు, 100 కోట్లు వసూలు చేస్తున్నారు. ఈ మంత్రం పక్క ఇండస్ట్రీలకు కూడా చూపిస్తే బాగుంటుందేమో మరి..?