AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ మల్టీస్టారర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఎన్టీఆర్ భామ.. షూటింగ్‏లోకి స్వాగతం పలికిన చిత్రయూనిట్..

తమిళ స్టార్ హీరో విశాల్, ఆర్య ప్రస్తుతం 'ఎనిమి' అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ శంకర్ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది.

భారీ మల్టీస్టారర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఎన్టీఆర్ భామ.. షూటింగ్‏లోకి స్వాగతం పలికిన చిత్రయూనిట్..
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2021 | 8:39 PM

Share

తమిళ స్టార్ హీరో విశాల్, ఆర్య ప్రస్తుతం ‘ఎనిమి’ అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ శంకర్ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఇందులో మరో హీరోయిన్ నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించి చిత్రయూనిట్.

ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత కింగ్, కేడి, కృష్ణార్జున, చింతకాయల రవి వంటి సినిమాల్లో నటించిన.. ఈ అమ్మడుకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో తెలుగులో కాకుండా మలయాళ సినిమాలకే పరితమైపోయింది ఈ బ్యూటీ. తాజాగా విశాల్, ఆర్య నటిస్తున్న ఎనిమి సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది మమతా. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‏లోనే చేశారు. తాజాగా షూటింగ్లో పాల్గోనడానికి వచ్చిన మమతాకు చిత్రయూనిట్ ట్విట్టర్ వేదికగా స్వాగతం పలికారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read:

అరుదైన ఘనత సాధించిన కీర్తిసురేశ్.. ‘ఫోర్బ్స్’ ఇండియా 2021లో చోటు దక్కించుకున్న ‘మహానటి’..