AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీ తొలిదశ షూటింగ్ పూర్తి.. సెకండ్ షెడ్యూల్ కోసం బయలుదేరిన మహానటి..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో.. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇందులో మహేష్‏కు కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుంది.

మహేష్ 'సర్కారు వారి పాట' మూవీ తొలిదశ షూటింగ్ పూర్తి.. సెకండ్ షెడ్యూల్ కోసం బయలుదేరిన మహానటి..
Rajitha Chanti
|

Updated on: Feb 15, 2021 | 9:25 PM

Share

Actress Keerthi Suresh : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో.. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేష్‏కు కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ దుబాయ్‏లో శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ రేపు ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‏లో పాల్గొనేందుకు కీర్తి.. తన ట్రావెల్ బ్యాగ్‏తో సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోను కీర్తి తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది.

ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగంలో జరిగే భారీ కుంభకోణాలు చుట్టూ జరుగుతుంది. ఇందులో ప్రకాశ్ రాజ్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కానీ ఈ సినిమాలో విలన్ ఎవరనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు చిత్రయూనిట్. మహేష్, పరశురాం కాంబోలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‏బీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నాయి.

Also Read:

మలేరియాతో ఇబ్బంది పడుతున్నా షూటింగ్ మిస్ చేయలేదు.. గత సంవత్సర అనుభవాలను చెబుతున్న అందాల తార..

Follow Us