గుండు గీయించుకొని ఎక్కడికైనా అదృశ్యం కావాలనిపించేది: కంగనా

బాలీవుడ్‌లోని లొసుగులపై కంగనా రనౌత్‌ మరోసారి రెచ్చిపోయారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా సుశాంత్‌ ఆత్మహత్య కేసు, నెపోటిజం, తదితర అంశాలపై మాట్లాడారు.

గుండు గీయించుకొని ఎక్కడికైనా అదృశ్యం కావాలనిపించేది: కంగనా
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 5:05 PM

బాలీవుడ్‌లోని లొసుగులపై కంగనా రనౌత్‌ మరోసారి రెచ్చిపోయారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా సుశాంత్‌ ఆత్మహత్య కేసు, నెపోటిజం, తదితర అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఓ విషయాన్ని ఆమె బయటపెట్టారు.

”2016లో నేను నటించిన ఒక చిత్రం మంచి హిట్ అయిన తరువాత 18 బ్రాండ్లకు అంబాసిడర్‌గా సంతకం చేశా. అయితే 2013లో నా నుంచి విడిపోయిన వ్యక్తి నా మీద కేసు నమోదు చేశాడు. దీన్ని సాకుగా చూపిస్తూ ఆ బ్రాండ్ల నుంచి నన్ను తొలగించారు. అంతేకాదు మంత్ర గత్తె, మనుషులను చంపుకు తినేది అంటూ నన్ను అభివర్ణించారు. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచన కూడా నాలో చచ్చిపోయింది. బ్రాండ్ల నుంచి నన్ను తీసేసిన తరువాత చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు చచ్చిపోవాలన్న ఆలోచన కూడా ఉండేది. గుండు గీయించుకొని ఎక్కడికైనా అదృశ్యం కావాలి అని భావించేదాన్ని. నా దగ్గరకు మా బంధువులు తమ పిల్లల్ని కూడా రానించే వారు కాదు” అని కంగనా వివరించారు.