AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజా హెగ్డే ‘నో’ చెప్తే.. లైన్‌లో రకుల్‌!

మాస్ మహారాజ రవితేజ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొదట క్రాక్‌ షూటింగ్‌ను పూర్తి చేయనున్న రవితేజ

పూజా హెగ్డే 'నో' చెప్తే.. లైన్‌లో రకుల్‌!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 06, 2020 | 6:03 PM

Share

Ravi Teja Heroine: మాస్ మహారాజ రవితేజ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొదట క్రాక్‌ షూటింగ్‌ను పూర్తి చేయనున్న రవితేజ.. ఆ తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా.. ఈ చిత్రానికి ఖిలాడీ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా., ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ఇక అందులో ఒక హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకుంటున్నారట దర్శకుడు.

ఇప్పటికే ఈ కథ గురించి ఆమెను సంప్రదించడం కూడా జరిగిందట. అయితే ఈ మూవీ విషయంపై పూజా ఇంకా ఏం చెప్పలేదట. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‌తో పూజా బిజీగా ఉండగా.. ఈ మూవీపై ఇంకా ఏ విషయం చెప్పనట్లు తెలుస్తోంది. ఒకవేళ పూజా చేయలేనని చెప్తే.. ఈ పాత్ర కోసం రకుల్‌ని సంప్రదించాలని దర్శకుడు భావిస్తున్నారట. కాగా గతేడాది మన్మథుడు 2లో టాలీవుడ్ ప్రేక్షకులకు దర్శనమిచ్చిన రకుల్‌.. ఆ తరువాత కనిపించలేదు. ఇప్పుడు ఈ భామ చేతిలో వైష్ణవ్ తేజ్‌-క్రిష్ ప్రాజెక్ట్ మాత్రమే(తెలుగులో) ఉన్న విషయం తెలిసిందే.

Read More:

ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రి దందా.. స్పందించిన ప్రధాని ఆఫీస్‌

అమానుష ఘటన.. కరోనా బాధితురాలిపై అంబులైన్స్ డ్రైవర్ అత్యాచారం