AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్ సిరీస్‏లో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో.. యాక్షన్ థ్రిల్లర్ కోసం సీరియస్‏గా షాహిద్..

దేశంలో ఓటీటీ వేగం పుంజుకుంటుంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుకుచుకున్నప్పటికీ పలువురు సెలబ్రెటీలు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు.

వెబ్ సిరీస్‏లో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో.. యాక్షన్ థ్రిల్లర్ కోసం సీరియస్‏గా షాహిద్..
Rajitha Chanti
|

Updated on: Dec 29, 2020 | 8:24 AM

Share

దేశంలో ఓటీటీ వేగం పుంజుకుంటుంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుకుచుకున్నప్పటికీ పలువురు సెలబ్రెటీలు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో చాలమంది నటీనటులు వెబ్ సిరీస్‏లో నటిస్తూ తమ లక్‏ను పరిక్షీంచుకుంటున్నారు. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా వెబ్ సిరీస్‏ చేయనున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సిరీస్ ప్రారంభించనున్నట్లుగా సమాచారం.

తెలుగులో సూపర్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్‏లో కబీర్ సింగ్ పేరుతో రిమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్రలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించాడు. అటు సందీప్ వంగ తెరకెక్కించిన ఈ సినిమా హిందీలోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా షాహిద్ కపూర్ ఓ వెబ్ సిరీస్ కోసం సీరియస్‏గా మారిపోయాడట. రాజ్, డీకే దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ డ్రామాలో ఈ సిరీస్‏ను చిత్రీకరించబోతున్నారట. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో షాహిద్ పాత్ర చాలా సీరియస్‏గా ఉంటుందని.. అంతేకాకుండా షాహిద్ సరసన తెలుగు హీరోయిన్ రాశీఖన్నా నటించనున్నందట. అలాగే ఇందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలకపాత్రలో నటించనున్నారు. ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ సిరీస్ షూటింగ్ జరగనుంది. ఏప్రిల్ కల్లా ఈ సిరీస్ షూటింగ్ పూర్తిచేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందట. ప్రస్తుతం నానీ నటించిన జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో షాహిద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దీని తర్వాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న యోధ అనే యాక్షన్ సినిమాకు కూడా షాహిద్ ఓకే చెప్పిన్నట్లుగా టాక్.

Follow Us