AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆచార్య కోసం ఆరాటపడుతున్న డైరెక్టర్ కొరటాల శివ .. చిరంజీవి కోసం కోట్లు ఖర్చుపెట్టి మరీ..

టాలీవుడ్ టాప్ హీరో మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఆచార్య కోసం ఆరాటపడుతున్న డైరెక్టర్ కొరటాల శివ .. చిరంజీవి కోసం కోట్లు ఖర్చుపెట్టి మరీ..
uppula Raju
|

Updated on: Dec 03, 2020 | 6:48 PM

Share

Acharya cinima: టాలీవుడ్ టాప్ హీరో మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైంది. హీరో చిరంజీవి రెగ్యులర్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ప్రత్యేక గీతంలో రెజీనా నర్తిస్తోంది. ఇందులో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇప్పటి వరకు 40 శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. కాగా ఈ నెలలో నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి ఉండటంతో మెగా ఫ్యామిలి మొత్తం ఉదయ్‌పూర్‌లోనే ఉండనుంది. ఈ వివాహం అనంతరం చిరు మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఓ భారీ సెట్ ప్లాన్ చేశారట. దానికోసం ఏకంగా 20 కోట్లు చేస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే 16 ఎకరాలలో కేరళ బ్యాక్‌డ్రాప్‌లో ఓ విలేజ్‌కు ప్లాన్ చేశారని సమాచారం. ఇందులో భాగంగా రూ. 4 కోట్లు ఖర్చు చేసి ఓ ఆలయాన్ని నిర్మించారని చిత్ర వర్గాలు అంటున్నాయి. దీని పర్యవేక్షణ మొత్తం దర్శకుడు కొరటాల శివ చూసుకుంటున్నారని తెలిసింది. ఈ సెట్‌లో చిరంజీవితో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని చెబుతున్నారు. సినిమా గురించి రోజుకో న్యూస్ తెలుస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.