AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఐకి సుశాంత్ కేసు.. కదిలొచ్చిన బాలీవుడ్‌

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ రోజురోజుకు ఎక్కువవుతోంది.

సీబీఐకి సుశాంత్ కేసు.. కదిలొచ్చిన బాలీవుడ్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2020 | 5:35 PM

Share

CBI for Sushant Case: బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ రోజురోజుకు ఎక్కువవుతోంది. సుశాంత్ కుటుంబ సభ్యులు మొదలు పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఈ కేసులు సీబీఐకి అప్పగించాలని ట్వీట్లు చేస్తున్నారు. ఇక సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్ కిర్తి తన సోదరుడికి న్యాయం జరగాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బాలీవుడ్ ముందడుగు వేసింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

వారిలో సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోక్వాండే, సుశాంత్ స్నేహితురాలు కృతి సనన్‌, వరుణ్ ధావన్, కంగనా రనౌత్‌, సంజనా సంఘి, పరిణితీ చోప్రా, సిద్ధాంత్ చతుర్వేది, డైజీ షా, మౌనీ రాయ్‌ తదితరులు ఉన్నారు. ఇందులో ఆసక్తి కలిగిన మరో విషయం ఏమిటంటే.. సుశాంత్ బతికున్నప్పుడు సూరజ్ పంచోలీ విషయంలో సల్మాన్, అతడిని హెచ్చరించాడన్న వార్తలు వచ్చాయి. సూరజ్‌తో జరిగిన గొడవ వలనే సుశాంత్‌ని పలువురు బ్యాన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా సూరజ్ పంచోలీ సైతం ఇప్పుడు సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించాలని కోరడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆయన కేసు రోజుకో ట్విస్ట్‌తో నడుస్తోన్న విషయం తెలిసిందే.

Read More:

ఆ దర్శకుడి కోసం రెండేళ్లు ఇవ్వాలనుకుంటోన్న ఎన్టీఆర్!

Bigg Boss 4: హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న జానీ మాస్టర్‌

https://www.instagram.com/p/CD0-cApBjR3/?utm_source=ig_embed