AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీలోకి అక్కినేని నాగార్జున? జగన్‌తో కీలక భేటీ..

హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ అధినేత జగన్‌తో ఎవరెవరు భేటీ అవుతున్నారనే విషయం చాలా ఆసక్తిగా మారింది. పలువురు నాయకులు జగన్‌‌ను కలిసిన అనంతరం కొద్ది రోజులకే వైసీపీలో చేరుతున్నారు. లేదా పార్టీకి మద్దతుగా ఉండటం, పార్టీ పరంగా ఏదొక పదవి కానీ, బాధ్యతను కానీ దక్కించుకుంటున్నారు. రాజకీయ నాయకుల భేటీ కన్నా సినిమా సెలబ్రిటీల భేటీకి ఎక్కువ ప్రాధాన్యత సంతరంచుకుంటుంది. మొన్ననే మంచు విష్ణు సతీ సమేతంగా జగన్‌ను కలిసి చర్చలు జరిపి చర్చలకు […]

వైసీపీలోకి అక్కినేని నాగార్జున? జగన్‌తో కీలక భేటీ..
Vijay K
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 7:52 PM

Share

హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ అధినేత జగన్‌తో ఎవరెవరు భేటీ అవుతున్నారనే విషయం చాలా ఆసక్తిగా మారింది. పలువురు నాయకులు జగన్‌‌ను కలిసిన అనంతరం కొద్ది రోజులకే వైసీపీలో చేరుతున్నారు. లేదా పార్టీకి మద్దతుగా ఉండటం, పార్టీ పరంగా ఏదొక పదవి కానీ, బాధ్యతను కానీ దక్కించుకుంటున్నారు. రాజకీయ నాయకుల భేటీ కన్నా సినిమా సెలబ్రిటీల భేటీకి ఎక్కువ ప్రాధాన్యత సంతరంచుకుంటుంది. మొన్ననే మంచు విష్ణు సతీ సమేతంగా జగన్‌ను కలిసి చర్చలు జరిపి చర్చలకు తెర లేపారు.

ఇదిలా ఉంటే తాజాగా అక్కినేని నాగార్జున జగన్‌తో భేటీ కావడంతో ఇప్పుడది సంచలనంగా మారింది. నాగార్జున రాజకీయాల్లోకి వస్తున్నారా? వైసీపీ తరుపున పోటీ చేస్తున్నారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే వైసీపీలోకి చేరేందుకు కాదని, మార్యాద పూర్వకంగానే కలిశారని వినిపిస్తోంది. అయితే గుంటూరు ఎంపీ టిక్కెట్‌ కోసం సిఫార్సు చేసేందుకే జగన్‌ను నాగార్జున కలిశారని వార్తలొస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోను చాలా కాలంగా నిర్వహిస్తోన్న వెంకటేశ్వరరావును రికమెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ కుదరకపోతే మరో వ్యాపారవేత్తకు టిక్కెట్ ఇవ్వాలని నాగార్జున కోరారట.

గుంటూరు నుంచి టీడీపీ తరుపున గల్లా జయ్‌దేవ్ పోటీ చేయనున్న సంగతి తెలిసందే. ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్ కావడంతో అదే రేంజ్‌లో ధీటుగా ఎదుర్కొనేందుకు ఆర్ధికంగా బలంగా ఉండేవారినే నిలబెట్టాలని వైసీపీ చూస్తున్నట్టు సమాచారం. మరి హాట్ సీటుగా మారిన గుంటూరు ఎంపీ సీటు ఎవరికి దక్కుతుంది. గుంటూరు ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. నాగార్జున రిఫర్ చేసిన వారికే జగన్ ప్రాధాన్యత ఇస్తారా? అసలు నాగార్జున కలిసింది గుంటూరు సీటు గురించి మాట్లాడేందుకేనా? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.