Green India challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన సీనియర్ హీరోయిన్ మీనా
ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాచాలెంజ్ నిర్విరామంగా సాగుతుంది. సామాన్యులు సెలబ్రిటీలు అందరు బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు.
Green India challenge: ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాచాలెంజ్ నిర్విరామంగా సాగుతుంది. సామాన్యులు సెలబ్రిటీలు అందరు బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ మీనా పాల్గొన్నారు. టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి నుంచి చాలెంజ్ను స్వీకరించిన మీనా చెన్నై సైదాపేట్లోని తన నివాసంలో మొక్కలు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. కాలుష్య రహిత వాతావరణం కోసం ప్రజలందరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు . పచ్చదనాన్ని పెంపొందించేలా ప్రతి ఒక్కరిలో గ్రీన్ఇండియాచాలెంజ్ ద్వారా ఎంపీ సంతోష్కుమార్ స్ఫూర్తిని నింపుతున్నారని ఆమె కొనియాడారు. అలాగే హీరో వెంకటేష్, కన్నడ హీరో కిచ్చా సుదీప్, మంజువారియర్, కీర్తిసురేష్లకు మీనా గ్రీన్ఇండియాచాలెంజ్ విసిరారు.
మరిన్ని ఇక్కడ చదవండి :