West Bengal election 2021: బెంగాల్‌లో ప్రారంభమైన ఆరో విడత పోలింగ్.. 43 స్థానాల్లో.. బరిలో 306 మంది అభ్యర్థులు

West Bengal Assembly election 2021: పశ్చిమ బెంగాల్​లో ఆరో విడత ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఆరో విడతలో భాగంగా 43 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్​ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా విస్తరిస్తున్న తరుణంలో ఆరో దఫా ఎన్నికలను కోవిడ్

West Bengal election 2021: బెంగాల్‌లో ప్రారంభమైన ఆరో విడత పోలింగ్.. 43 స్థానాల్లో.. బరిలో 306 మంది అభ్యర్థులు
West Bengal Election 2021
Follow us

|

Updated on: Apr 22, 2021 | 7:01 AM

West Bengal Assembly election 2021: పశ్చిమ బెంగాల్​లో ఆరో విడత ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఆరో విడతలో భాగంగా 43 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్​ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా విస్తరిస్తున్న తరుణంలో ఆరో దఫా ఎన్నికలను కోవిడ్ నిబంధనలతో పకడ్భందీగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. అధికార టీఎంసీ, బీజేపీ గట్టిగా పోటీపడుతున్నాయి. కాంగ్రెస్, వామపక్ష కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఆరో దశ ఎన్నికల్లో భాగంగా బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని 17 స్థానాలకు, నదియా జిల్లాలోని 9స్థానాలకు, ఉత్తర్​ దినాజ్​పుర్​ జిల్లాలోని 9 స్థానాలకు, పూర్వ బర్ధామన్ జిల్లాలోని 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 14,480 పోలింగ్​ కేంద్రాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6:30గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. 1.03 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. ఈరోజు జరుగుతున్న 43 సీట్లల్లో 306 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బరిలో ప్రముఖులు.. ఈ రోజు జరిగే ఎన్నికల్లో.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్​ రాయ్​, తృణమూల్​ కాంగ్రెస్​ సీనియర్​ నేతలు జ్యోతిప్రియ మల్లిక్​, చంద్రిమ భట్టాచార్య, సీపీఐ(ఎం) తరఫున తన్మయ్​ భట్టాచార్య ఉన్నారు. వీరితో పాటు టీఎంసీ తరఫున బరిలో ఫిల్మ్ డైరక్టర్ రాజ్​ చక్రవర్తి, నటి కౌషాని ముఖర్జీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కాగా.. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్​లో.. ఇప్పటికే ఐదు విడతల్లో 180 నియోజకవర్గాలకు పోలింగ్​ ముగిసింది. మిగిలిన 114 సీట్లల్లో ఈ రోజు 43 సీట్లల్లో పోలీంగ్ జరుగుతోంది. మిగతా రెండు విడతల ఎన్నికలు ఏప్రిల్ 26, 29న జరగనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

Also Read:

Corona Pandemic: కర్ఫ్యూ కట్టుబాట్లు.. కరోనా ఇబ్బందులు.. ఉత్తరప్రదేశ్ లో బ్యాంకుల పనివేళల కుదింపు

Corona Medicine: క్లినికల్ ట్రయల్స్ లో కరోనా వ్యాధి లక్షణాలు తగ్గించే కొత్త మందు పరిశోధనలు..త్వరలో అందుబాటులోకి!

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..