UP Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్!
Uttar Pradesh Assembly Election 2022: సమయంలో, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాంపూర్ ఖాస్ స్థానం నుండి తన అభ్యర్థిని నిలబెట్టకూడదని నిర్ణయించుకున్నారు.

UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 (Uttar Pradesh Assembly Election 2022)కోసం కాంగ్రెస్(Congress)- సమాజ్ వాదీ పార్టీ (Samajwadi Party) మధ్య పొత్తు లేదు. అవగాహన ఒప్పందం మేరకు అభ్యర్థుల ఎంపికల్లో జాగ్రత్తు పాటించినట్లు కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలోని కొన్ని స్థానాల్లో మాత్రం ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు అభ్యర్థులను నిలబెట్టలేదు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav), ఆయన మామ శివపాల్ సింగ్ యాదవ్లపై కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టబోమని ఇటీవలే ప్రకటించింది. అయితే, మైన్పురిలోని కర్హల్ స్థానానికి కాంగ్రెస్ ముందుగా అభ్యర్థిని ప్రకటించింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ తన అభ్యర్థి పేరును ఉపసంహరించుకుంది. అదే సమయంలో, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాంపూర్ ఖాస్ స్థానం నుండి తన అభ్యర్థిని నిలబెట్టకూడదని నిర్ణయించుకున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ కుమార్తె ఆరాధనా మిశ్రా మోనా మిశ్రా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఎస్పీ వాకోవర్ ఇచ్చినట్లు చర్చ సాగుతోంది.
వాస్తవానికి రాంపూర్ ఖాస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆరాధన మిశ్రా ‘మోనా మిశ్రా’ పోటీ చేస్తున్నారు. కాగా రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆమె తండ్రి ప్రమోద్ తివారీకి సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇచ్చింది. కాగా, ఇటీవలే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్ యాదవ్లపై అభ్యర్థులను నిలబెట్టకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ తర్వాత ఇప్పుడు ఎస్పీ కూడా రాంపూర్ ఖాస్ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. అదే విధంగా కొన్ని నెలల క్రితం జరిగిన జిల్లా పంచాయతీ అధ్యక్ష ఎన్నికల్లో రాజా భయ్యా పార్టీ జనసత్తా దళ్ లోక్తాంత్రిక్ అభ్యర్థికి మాజీ ఎంపీ ప్రమోద్ తివారీ మద్దతు పలికారు. అందుకే, మోనా మిశ్రాపై అభ్యర్థిని నిలబెట్టకూడదని కూడా నిర్ణయించుకున్నాడు.
అదే సమయంలో, SP ఒక విధంగా కాంగ్రెస్కు బహిరంగ మద్దతు ఇవ్వడంతో పాటు జనసత్తా దళ్ కూడా ఈ ఎన్నికల్లో రాంపూర్ ఖాస్లో తన అభ్యర్థిని నిలబెట్టలేదు. అయితే కాంగ్రెస్ అభ్యర్థికి ఇరు పార్టీలు వాకోవర్ ఇచ్చాయనే చర్చ పొలిటికల్ కారిడార్లో జోరుగా సాగుతోంది. ఇటీవలే, కర్హాల్ మరియు జస్వంత్ నగర్ అసెంబ్లీ స్థానాలకు అఖిలేష్ యాదవ్ మరియు అతని మామ శివపాల్ యాదవ్లపై అభ్యర్థులను నిలబెట్టకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఏర్పడే పరిస్థితికి రెండు పార్టీలు మార్గాన్ని సులభతరం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Read Also…. AP CM YS Jagan: శ్రీశారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏపీ సీఎం.. రాజశ్యామల యాగంలో పాల్గొన్న వైఎస్ జగన్