ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో
మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధం వుంది. చుట్టూ సంచరించే పలు రకాల జంతువులను మచ్చిక చేసుకుని వాటి పై ఆధారపడి మనిషి జీవిస్తుంటాడు. అయితే కోడి , మేక , ఆవులు , పశువులు , కుక్క ఇవన్నీ తమ యజమానికి నమ్మకంగా ఉంటాయి. వారి మాట వినటంతో పాటు పెంపకందారు నివాస ప్రాంతంలో జీవిస్తుంటాయి. ఐతే ఆ ఊర్లో ఉన్న కొండముచ్చు మాత్రం ఊరందరికీ స్నేహితుడిగా మారిపోయింది. ఎవరు ఏది పెట్టినా తినటం అందరితో కలిసిపోవడం తో ఎవరు దాన్ని ఏమి అనటంలేదు. కొన్ని రోజుల క్రిందట ఎక్కడినుండి వచ్చిందో ఒక వానరం ఆ కుటుంబంతో కలిసిపోయింది.
ఆ కుటుంబ సభ్యులు కూడా తమ పిల్లలతో సమానంగానే ఆ వానరాన్ని చూస్తున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మోడీ గ్రామంలో జరిగింది.గ్రామానికి చెందిన దాసరి హనుమంతు ఇంటిని ఒక వానరం గత కొన్ని రోజులుగా తన నివాసంగా మార్చుకుంది. కొన్ని రోజుల కిందట ఈ వానరానికి కాలికి దెబ్బ తగలడంతో చరణ్ ధైర్యంతో వానరాన్ని చేరదీసి వైద్యం చేయించాడు. దీంతో అప్పటి నుండి ఆ కుటుంబ సభ్యుల వద్దనే ఈ వానరం ఉంటుంది. సాక్షాత్తు ఆ శ్రీరాముడే తమ ఇంటికి ఆంజనేయ స్వామి రూపంలో వచ్చాడని ఆ కుటుంబ సభ్యులు ఆనంద పడుతున్నారు. వారు ఏది ఇచ్చినా తింటూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది, వారి పిల్లలతో ఆడుకుంటుంది. గ్రామంలోని అందరూ దానిని ముద్దుగా హనుమంతు, అంజి అనే పేరుతో పిలుస్తున్నారు.

వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి

వీడు ఎవడండీ బాబూ... 77 సార్లు 100కి కాల్ చేసిన తాగుబోతు వీడియో

ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

విభిన్నంగా పెళ్లి పిలుపు - ఆ మాత్రం క్రియేటివిటీ లేకపోతే ఎలా..?

80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే

బాంబులు పడతాయని భయం వేసింది వీడియో

కొడుకు చేతికి ఫోన్ ఇస్తే..తల్లికే చుక్కలు చూపెట్టాడుగా వీడియో
