AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్లుగా ప్రేమించుకొని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. కానీ రెండు సంవత్సరాలు గడిచాయో లేదో..

ఐదేళ్లుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అగ్నిసాక్షిగా తోడు ఉంటానని చెప్పిన భర్త రోజులు గడిచిన కొద్ది వేధించటం మొదలెట్టాడు.

ఐదేళ్లుగా ప్రేమించుకొని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. కానీ రెండు సంవత్సరాలు గడిచాయో లేదో..
uppula Raju
|

Updated on: Dec 09, 2020 | 3:53 PM

Share

ఐదేళ్లుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అగ్నిసాక్షిగా తోడు ఉంటానని చెప్పిన భర్త రోజులు గడిచిన కొద్ది వేధించటం మొదలెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎమ్మగనూరు ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పెద్దతుంబళం గ్రామానికి చెందిన సుంకప్ప, అదే ప్రాంతానికి చెందిన సుజాత ఐదేళ్లుగా ప్రేమించుకొని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. సుంకప్ప తుంగభద్ర రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్‌మెన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. సుంకప్పతో పాటు వారి తల్లిదండ్రులు, బావలు సుజాతను వేధించడం మొదలెట్టారు. భరించలేని సుజాత పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నిరోజులకు ఆమె తల్లిదండ్రులు సర్దిచెప్పి మళ్లీ అత్తవారింటికి పంపించారు. అయినా కూడా గొడవలు ఆగలేదు. నిన్న డ్యూటికి వెళ్లొచ్చిన సుంకప్ప మళ్లీ సుజాతతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె పిల్లలను విడిచిపెట్టి బయటికి వెళ్లిపోయింది. వెంటనే సుంకప్ప ఈ విషయాన్ని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పాడు. అందురు కలిసి వెతికినా సుజాత ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మిగనూరు అగ్నిమాపక కేంద్రం సమీపంలోని ఎల్‌ఎల్‌సీలో మృతదేహం బయటపడింది. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన వారు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబ సభ్యులు సుజాతగా గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మ‌ృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త ఆస్పత్రికి తరలించారు. సుంకప్ప కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.