న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలకు దారితీసిన పరిస్థితులు.? కుంటశ్రీనుకు ముడిపడిన అంశాలు.!
గుంజపడుగు గ్రామంలో కొనసాగుతున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణమే లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గుడి నిర్మాణం కోసం
గుంజపడుగు గ్రామంలో కొనసాగుతున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణమే లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గుడి నిర్మాణం కోసం కుంట శ్రీను పెద్ద ఎత్తు అక్రమాలకు పాల్పడుతున్నారని తరచూ న్యాయవాది గట్టు వామన్రావు ఆరోపణలు చేసేవారు. వాట్సాప్గ్రూపుల్లో దీనిపై చర్చకు కారణమయ్యేలా పోస్టులు పెట్టేవారు. చందాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని… గుడిని ఓ ప్రైవేటు కంపెనీ నిర్మిస్తోందని ఆరోపణలు చేసేవారు.
తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని మన మంథని నియోజకవర్గం గ్రూపులో పోస్టులు పెట్టారు. నేరుగా ఎక్కడా కుంట శ్రీను పేరు చెప్పకపోయినా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ నిర్మాణాల వద్ద గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ప్లెక్సీ ఫొటోలను కూడా గ్రూపులో పెట్టారు. వివిధ వార్త పత్రిల్లో వచ్చిన న్యూస్ను కూడా పోస్టు చేసి విమర్శల వాడిని పెంచారు. గట్టు వామనరావు పోలీసు వ్యవస్థను కూడా ప్రశ్నించారు. అనాధికారికంగా రామాలయానికి రంగులు వేస్తుంటే పట్టించుకోరా అంటూ నిలదీశారు. 100కు డయల్ చేసినా మంథనిలో స్పందించే పోలీసులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటివి చాలా అంశాలు ఈ మర్డర్తో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. కుంట శ్రీను చేస్తున్న అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో వామన్రావు రిట్ ఫైల్ చేశాడు. మరో రిట్ మంథని కోర్టులో ఫైల్ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వామన్రావు సోషల్ మీడియాలో పోస్టులు సైతం చేశారు. గ్రామంలో రామాలయం కమిటీ నియామకం, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ విషయంలో సైతం వామన్రావు తలదూర్చడంతో గ్రామానికి చెందిన రిటైర్డు అధికారితో కూడా విబేధాలున్నాయి. హత్యలో ఆయన ప్రమేయం పైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు 900 కోట్లు ఇసుక క్వారీలతో అక్రమంగా సంపాదించాడని హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి… మధు పోటీ చేయకుండా ప్రయత్నించిన తీరు అప్పట్లో వివాదమైంది. వన్యప్రాణి వేట కేసులో మంథని పోలీస్స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న నిందితుడి సంఘటనలో సైతం పోలీసులే కొట్టి చంపారని కోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన తీరు కూడా వివాదాస్పదమైంది. ఇలా పలు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల విషయాల్లో ఎదురునిలిచారనే ప్రచారం ఉంది.