Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య..వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

 AP Crime News: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అర్ధర్రాతి 1గంట సమయంలో మునసబుగారి వీధిలో మోడల్ డైరీ..

AP Crime News: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య..వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు
Ap Crime News
Follow us
Surya Kala

|

Updated on: Sep 18, 2021 | 3:13 PM

AP Crime News: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అర్ధర్రాతి 1గంట సమయంలో మునసబుగారి వీధిలో మోడల్ డైరీ ఓనర్ సురేష్ ప్రభుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు, కత్తి తో విచక్షణారహితంగా నరకడం తో సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి విజయవాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మరణించాడు.

సురేష్ ప్రభు హత్యకు కారణం అతను పెట్టుకున్న వివాహేతర సంబంధమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. సురేష్ అక్రమ పెట్టుకున్న మహిళా ఇంటి సమీపంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి అక్రమ సంబంధమే కారణం గా అనుమానిస్తున్నారు. అయితే సురేష్ ని కత్తితో పొడుస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

పరీక్ష తేదీలు విడుదల.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

గీతాగోవిందం’ సినిమా చూసి రెచ్చిపోయిన యువకుడు.. బస్సులో పక్క సీట్లో కూర్చున్న అమ్మాయిని..

 తమన్నా బ్రెయిన్‌ను మార్చేశారు, ఎందుకలా చంపుతుందంటూ ఏడ్చేసిన దర్శకుడి కూతురు.. ఎందుకో తెలుసా?