AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Fire Accident: ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు.. ఆకతాయిల పనా? మావోయిస్టుల దుశ్చర్యా..?

ములుగు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు.. వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఈ ఘటన జరిగింది.

Bus Fire Accident: ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు.. ఆకతాయిల పనా? మావోయిస్టుల దుశ్చర్యా..?
Bus Fire
Balaraju Goud
|

Updated on: Dec 15, 2021 | 7:16 AM

Share

TSRTC Bus Fire Accident: ములుగు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు.. వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఈ ఘటన జరిగింది. బస్‌ స్టేషన్‌లో నైట్‌ హాల్ట్‌గా ఉన్న ములుగు డిపోకు చెందిన బస్సు తిరిగి తెల్లవారుజామున బయల్దేరి వెళ్తుంది. అయితే, నైట్ హాల్ట్ చేసిన బస్సుకు అర్థరాత్రి వేళ వెనక భాగంలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. బస్సు పాక్షికంగా తగులబడింది.

ఈ సంఘటనలో బస్సు వెనుక భాగం, ఒక చక్రం, బస్సులోని సీటు కాలిపోయాయి.. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ తేరుకుని స్థానికుల సహాయంతో మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మావోయిస్టులు ఏదైనా అఘాయిత్యానికి ప్రయత్నించారా? లేక ఆకతాయిల పనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనా స్థలంలో ఎలాంటి లేఖలు లభించక పోవడంతో ఎవరైనా ఆకతాయిలు ఈపని చేసి ఉంటారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  Viral Video: వివాహ వేడుకలో వధూవరులు అత్యుత్సాహం.. గాలిలోకి 4 రౌండ్ల కాల్పులు.. పోలీసుల ఎంట్రీతో..