AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్య..సూసైడ్ నోట్‌లో ఏముందంటే..?

విద్యార్థులు చిన్న, చిన్న విషయాలకు కూడా మాససికంగా కృంగిపోయి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. టీనేజ్ సమయంలో ప్రతి ఒక్కరి మైండ్‌సెట్ చాలా నారోగా ఉంటుంది. ప్రతి విషయాన్ని పర్సనల్‌గా తీసుకోవడం..ఆకర్షణను ప్రేమగా భావించి దూకుడు పనులు చెయ్యడం ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వారు ఎదుటివాళ్ల ప్రాణాలు తీయడంతో పాటు.. తమ ప్రాణాలు తీసుకోడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా అటువంటి ఘటనే ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో జరిగింది. మాస్టర్ కొట్టాడన్న […]

టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్య..సూసైడ్ నోట్‌లో ఏముందంటే..?
Ram Naramaneni
|

Updated on: Nov 12, 2019 | 4:40 AM

Share

విద్యార్థులు చిన్న, చిన్న విషయాలకు కూడా మాససికంగా కృంగిపోయి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. టీనేజ్ సమయంలో ప్రతి ఒక్కరి మైండ్‌సెట్ చాలా నారోగా ఉంటుంది. ప్రతి విషయాన్ని పర్సనల్‌గా తీసుకోవడం..ఆకర్షణను ప్రేమగా భావించి దూకుడు పనులు చెయ్యడం ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వారు ఎదుటివాళ్ల ప్రాణాలు తీయడంతో పాటు.. తమ ప్రాణాలు తీసుకోడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా అటువంటి ఘటనే ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో జరిగింది.

మాస్టర్ కొట్టాడన్న నెపంతో.. సాయి కిరణ్ అనే టెన్త్ స్టూడెంట్‌ హాస్టల్ గదిలోనే ఉరి వేసుకొని చనిపోయాడు. కోయగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ విషాదం చోటుచేసుకుంది. టీచర్ కొట్టడం వల్లే..తాను చనిపోతున్నానని సూసైడ్‌ నోట్‌లో అతడు ప్రస్తావించడం ఇప్పుడు కలకలంగా మారింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తోటి రూమ్‌మేట్స్‌తో పాటు ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు.