కృష్ణా జిల్లాలో విద్యుత్ పోల్ వేసేందుకు గొయ్యి తవ్వుతుండగా.. గుండె ఆగినంత పనైంది.!

కృష్ణాజిల్లా నందిగామలో కూలిపనిలో ఉన్న కూలీలతోపాటు, విద్యుత్ సిబ్బందికి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. రహదారి పక్కన విద్యుత్ పోల్ వేసేందుకు గొయ్యి తవ్వుతోన్న విద్యుత్ సిబ్బంది..

కృష్ణా జిల్లాలో విద్యుత్ పోల్ వేసేందుకు గొయ్యి తవ్వుతుండగా.. గుండె ఆగినంత పనైంది.!
Nandigama 2
Follow us

|

Updated on: Aug 10, 2021 | 2:50 PM

Skeleton: కృష్ణాజిల్లా నందిగామలో కూలిపనిలో ఉన్న కూలీలతోపాటు, విద్యుత్ సిబ్బందికి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. రహదారి పక్కన విద్యుత్ పోల్ వేసేందుకు గొయ్యి తవ్వుతోన్న విద్యుత్ సిబ్బంది.. కూలీలు హఠాత్పరిణామానికి భీతిల్లిపోయారు. కొంచెం లోతుకి గొయ్యి తవ్విన అనంతరం వారికి గోతిలో అస్తిపంజరం బయల్పడింది. దీంతో అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు విద్యుత్ సిబ్బంది. ఆపై తేరుకుని ఘటనపై నందిగామ పోలీసులకు సమాచారమిచ్చారు.

Nandigama

Nandigama

దీంతో ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేఅయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో మనిషిని చంపి రోడ్డు పక్కనే పూడ్చిపెట్టి ఉంటారని స్థానికులు అంటున్నారు.

Read also: RSP: ‘మాపై ప్రేమ ఉంటే మీ ఆస్తులమ్మి ఖర్చు పెట్టండి..’ రాజ్యాధికార సంకల్ప సభలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్